తెలంగాణా ప్రవాసుడు మిట్టపల్లి సురేష్ అమెరికాలోని ఫ్లోరిడా రాష్ట్ర జాక్సన్విల్ తెలుగు సంఘం(తాజా) 2022 అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టారు. గత 19 సంవత్సరాలుగా జాక్సన్విల్ పరిసర ప్రాంత తెలుగు వారికి సేవలందిస్తున్న ఈ సంస్థను బలోపేతం చేసే దిశగా కృషి చేస్తానని, తెలుగువారిని ఒకేతాటిపైకి తీసుకువచ్చే కార్యక్రమాలకు రూపకల్పన చేసి న్రివహిస్తామని సురేష్ తెలిపారు. 2022 నూతన కార్యవర్గంలో ఉపాధ్యక్షుడిగా సత్తి నాగమల్లీశ్వర్, కార్యదర్శిగా శొంఠి భవానీ, కోశాధికారిగా కందె శ్రీధర్, తదుపరి అధ్యక్షుడిగా బచ్చు మహేష్లు వ్యవహరిస్తారు.