Movies

తిరుమల-శ్రీకాళహస్తిలో కంగనా పూజలు

తిరుమల-శ్రీకాళహస్తిలో కంగనా పూజలు

ప్రముఖ బాలీవుడ్ హీరోయిన్‌ కంగనా రనౌత్‌ శనివారం శ్రీకాళహస్తి ముక్కంటీశ్వరున్ని దర్శించుకుంది. ఈ సందర్భంగా ఆలయాధికారులు ఆమెకు సాదర స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. కాగా దర్శనానికి ముందు ప్రత్యేక రాహుకేతు పూజల్లో పాల్గొందీ అందాల తార. అనంతరం స్వామి అమ్మవార్లను దర్శించుకుంది. ఈ సందర్భంగా దేవస్థానం అర్చకులు ఆమెకు ముక్కంటీశుని ప్రసాదాలు, వేదాశీర్వచనాలు అందజేశారు. కాగా కంగనా వెంట శ్రీకాళహస్తి వైసీపీ ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్‌ రెడ్డి ఉన్నారు. కాగా అంతకుముందు తిరుమల శ్రీవారి సేవలో పాల్గొంది కంగనా. శనివారం ఉదయం 2 గంటలకు వీఐపీ విరామ సమయంలో శ్రీవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. ఈ సందర్భంగా రంగనాయకుల మండపంలో ఆమెకు వేద పండితులు ఆశీర్వాదాల అందించారు. పట్టు వస్రాలతో సత్కరించి తీర్థ ప్రసాదాలు అందజేశారు. నూతన సంవత్సరం సందర్భంగా పలువురు ప్రముఖులు తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. స్టార్‌ డైరెక్టర్‌ అనిల్‌ రావిపూడి, నటుడు సాయికుమార్‌ కూడా వెంకటేశ్వర స్వామి సేవలో పాల్గొన్నారు.