NRI-NRT

కర్నూలులోని పాఠశాలకు ₹లక్ష విరాళం అందించిన సునీత

కర్నూలులోని పాఠశాలకు ₹లక్ష విరాళం అందించిన సునీత

ఓర్వకల్లు పొదుపుమహిళలు స్వయంశక్తితో నిర్మించి, నిర్వహిస్తున్న బాలభారతి పాఠశాలకు ప్రముఖ గాయని సునీత లక్ష రూపాయల విరాళం అందించారు. గత అక్టోబర్ నెలలో కర్నూలు ఎన్నారై ఫౌండేషన్ చైర్మన్ పొట్లూరి రవి ఆహ్వానం మేరకు బాలభారతి పాఠశాలలో కంప్యూటర్ ల్యాబ్ ప్రారంభించిన సునీత భవిష్యత్తులో బాలభారతి పాఠశాలకు తన వంతు సహకారం అందిస్తానని తెలిపారు. ఆర్థిక సహకారంతో పాటు సునీత తల్లి ప్రముఖ సంగీత గురువు ఉపద్రష్ట సుమతి బాలభారతి పాఠశాలలోని విద్యార్థులకు ఆన్ లైన్లో ఉచితంగా సంగీత పాఠాలు నేర్పిస్తున్నట్లు ఓర్వకల్లు పొదుపు సంఘం నిర్వాహకురాలు విజయభారతి తెలిపారు. సునీత అందిస్తున్న సహకారానికి బాలభారతి పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు కృతజ్ఞతలు తెలిపారు.