DailyDose

TNI నేర వార్తలు 29/1/2022

TNI నేర వార్తలు 29/1/2022

* ప్రకాశం జిల్లా మాట్రిమోనియల్ సైట్‌లతో అమాయక ఆడవాళ్ళను మోసం చేసిన ఘరానా సైబర్ మోసగాడిని అరెస్టు చేసిన ప్రకాశం జిల్లా పోలీసులు.

* అమీర్పేట లోని KLM షో రూమ్ సీజ్ చేసిన GHMC అధికారులు

* తొర్రూరుకు చేరుకున్న టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డికి అభిమానులు ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం నెల్లికుదురు మండలం సంధ్యా తండాలో ఉపాధ్యాయుడు జేత్ రామ్ కుటుంబ సభ్యులను రేవంత్ పరామర్శించారు. అనంతరం బయ్యారంలో ఆత్మహత్య చేసుకున్న నిరుద్యోగి సాగర్ కుటుంబ సభ్యులను ఆయన పరామర్శించనున్నారు.

* విజయనగరం జిల్లాబొబ్బిలి గ్రోత్ సెంటర్లో అర్ధరాత్రి అగ్నిప్రమాదం.బెర్రీ ఫెర్రోఎల్లాయీస్ పరిశ్రమలో గ్యాస్ లీకై చోటుచేసుకున్న అగ్నిప్రమాదం.13 మంది కార్మికులకు తీవ్రగాయాలు.ఇద్దరి పరిస్థితి విషమం.క్షతగాత్రులను విజయనగరంలోని ప్రైవేటు ఆసుపత్రికి తరలించిన యాజమాన్యం, పోలీసులు.

* నాగర్ కర్నూలు జిల్లాలోని పెద్దకొత్తపల్లి మండలం మారేడు మాన్ దిన్నె గ్రామం నల్లమల అడవి సమీపంలోని మారుమూల గ్రామం. ఈ గ్రామానికి కేవలం ఒకే ఒక బస్సు వెళుతుంది. అయితే గ్రామానికి చెందిన రైతు గోపయ్య తన వ్యవసాయ పొలంలో పండించిన బొప్పాయి పండ్లను ప్రతినిత్యం కొల్లాపూర్ పట్టణానికి బస్సులో తీసుకువెళ్లి అమ్ముకుని జీవనం సాగిస్తున్నాడు. రోజువారీగా శుక్రవారం బొప్పాయి పండ్లను బస్సులో తీసుకువెళ్లేందుకు రోడ్డుపై పెట్టుకోగా ఆర్టీసీ డ్రైవర్ కు ఉచితంగా రైతు పండ్లు ఇవ్వలేదని ఆగ్రహంతో రైతు పండించిన బొప్పాయి పండ్ల ను బస్సులో తీసుకువెళ్ళకుండా వెళ్ళిపోయాడు. దీంతో ఆవేదనకు లోనైన రైతు గోపయ్య బస్సు కొల్లాపూర్ నుండి తిరిగి గ్రామానికి వచ్చిన సమయంలో రోడ్డుపై బొప్పాయి పండ్లతో గంట పాటు నిరసన వ్యక్తం చేశారు.

* ఎచ్చెర్ల మండలంలోని ముద్దాడపేటలో దారుణం జరిగింది. తన కుటుంబ సభ్యులపై కత్తితో రీసు అప్పన్న దాడి చేశాడు. దాడి అనంతరం నిందితుడు తనను తాను పొడుచుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. అప్పన్న దాడిలోభార్యఅత్తమ్మసోదరి అక్కడికక్కడే మృతి చెందగా.. మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. బాధితులను స్థానికులు దగ్గర్లో ఉన్న ఆస్పత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. నిందితుడు మద్యం మత్తులో ఈ దారుణానికి పాల్పడినట్లు పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

* శంషాబాద్ ఎయిర్‌పోర్టులో కస్టమ్స్ అధికారులు తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో ఫారిన్ కరెన్సీని అధికారులు పట్టుకున్నారు.దుబాయ్ నుంచి వచ్చిన ప్రయాణికుడి వద్ద సౌదీ అరేబియన్ దాలర్స్‌ను కస్టమ్స్ గుర్తించారు. దీని విలువల లక్షలు ఉంటుందని కస్టమ్స్ అధికారులు తెలిపారు. ఫారెన్ కరెన్సీ సీజ్ చేసి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

* పబ్‌జీ మైకంలో పడిన ఓ మైనర్‌ తన కుటుంబం మొత్తాన్ని కాల్చి చంపాడు. పాకిస్థాన్‌లోని లాహోర్‌లో నహీద్‌ ముబారక్‌ (45), ఆమె తనయుడు తైమూర్‌(22), ఇద్దరు కుమార్తెలు (17, 11) కొన్ని రోజుల క్రితం వారి ఇంట్లో విగతజీవులుగా కనిపించారు. నహీద్‌ చిన్న కుమారుడు(14) మాత్రమే బతికిబట్టకట్టాడు. వారెలా చనిపోయారో తనకు తెలియదని బుకాయించిన బాలుడిని విచారించగా తానే హత్య చేసినట్లు అంగీకరించాడు. గంటలూ పబ్‌జీ ఆటలోనే ఉన్న బాలుడిలో మానసిక సమస్యలు తలెత్తాయని పోలీసులు తెలిపారు. చదువుపై దృష్టి పెట్టడంలేదని తిట్టిన తల్లిని నిందితుడు ఆమె తుపాకీతోనే కాల్చాడు. నిద్రలో ఉన్న సోదరుడుఇద్దరు అక్కలను కూడా కాల్చి చంపాడు.

*హనుమంతునిపాడు మండల సర్వసభ్య సమావేశంలో తహశీల్దార్ నాగార్జున రెడ్డిపై దాడి చేసిన వైసీపీ నాయకుడు భవనం కృష్ణారెడ్డిపై పోలీసులు కేసు నమోదు చేశారు. మద్యం సేవించి దాసరిపల్లి సర్పంచ్ భవనం కృష్ణారెడ్డి తనపై దాడి చేసి బెదిరింపులకు పాల్పడ్డాడని తహశీల్దార్ నాగార్జున రెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేశారు. భవనం కృష్ణారెడ్డిపై ఐపీసీ 353, 506 సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు.

*పెద్దఅంబర్ పేట దగ్గర అక్రమంగా ఆవులను కబేళాలకు తరలిస్తున్న వాహనాన్ని పోలీసులు పట్టుకున్నారు. ఔటర్‌ రింగ్‌రోడ్‌పై ఆవులను తరలిస్తున్న డీసీఎం వాహనాన్నిపట్టుకుని పోలీసులు సీజ్ చేశారు. డీసీఎం డ్రైవర్‎తో పాటు పలువురిని అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్‎కు తరలించారు. ఆవులను ఆలేటి ఆశ్రమ గోశాలకు తరలించినట్లు పోలీసులు తెలిపారు.

*వి.మాడుగుల మండలం ఎం.కోడూరు జంక్షన్‌లో స్పెషల్ ఎన్ఫోర్స్‌మెంట్ అధికారులు తనిఖీలు నిర్వహించారు. అక్రమంగా తరలిస్తున్న కేజీల గంజాయిని అధికారులు పట్టుకున్నారు. ఇద్దరు స్మగ్లర్లను అధికారులు అరెస్ట్ చేశారు. బోలేరో వాహనాన్ని సీజ్ చేశారు. పట్టుబడిన గంజాయి విలువ లక్షలు ఉంటుందని అంచనా.

*కడలూరు సమీపంలో శిధిలావస్థకు చేరిన ఇళ్లు కూలిన ఘటనలో ఇద్దరు ప్లస్‌ టూ విద్యార్థులు మృతిచెందిన ఘటన విషా దానికి దారితీసింది.

*డాబాపైన ఉన్న కొడుకు కిందికొస్తాడేమో అని ఆ తల్లి చాలాసేపు ఎదురు చూసింది. ఎంతకూ రాకపోవడంతో అన్నం తినేందుకు రమ్మని పిలుస్తూ ఆమే పైకి వెళ్లింది. తర్వాత అక్కడ కనిపించిన దృశ్యం చూసిఆ తల్లి షాకైంది. సగం కాలిన స్థితిలో ఉన్న కొడుకు శవాన్ని చూసి బోరుమంది. ఈ ఘటన స్థానికంగా సంచలనం రేకెత్తిచింది.

*హిందూపురం అంబేద్కర్ సర్కిల్ వద్ద తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. హిందూపురంను జిల్లా కేంద్రంగా ప్రకటించాలని డిమాండ్ చేస్తూ నవీన్ అనే యువకుడు ఆత్మహత్య యత్నం చేశాడు. సకాలంలో స్పందించి యువకుడి చేతిలో నుంచి అఖిలపక్ష నేతలు పెట్రోల్ బాటిల్ లాక్కున్నారు. అంబేద్కర్ సర్కిల్ వద్దకు పోలీసులు భారీగా చేరుకున్నారు. ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా అఖిలపక్ష నేతలు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు.

*అయినవిల్లి మండలం మాగం కొప్పిశెట్టివారి పాలెంలో ప్రియురాలు మోసం చేసిందని కోప్పిశెట్టి శంకరరావు అనే యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ప్రేమ పేరుతో తన వద్ద నుంచి భారీగా డబ్బులు బంగారం తీసుకుని ఇప్పుడు మరొక వ్యక్తిని పెళ్ళి చేసుకుంటోందని యువకుడు సెల్ఫీ వీడియోలో తెలిపాడు. యువతితో కలిసి ఉన్న ఫోటోలను సదరు యువకుడు వీడియోలో షేర్ చేశాడు. అమ్మాయి మోసం చేసినందుకే చనిపోతున్నానంటూ సెల్ఫీ వీడియోలో తెలిపాడు. యువకుడికి గతంలో మరో యువతితో వివాహంభార్యభర్తలు విడిపోయినట్టు సమాచారం.

*విశాఖ జిల్లా డుంబ్రిగుడ మండలం సభ పంచాయతీ మొర్రిగుడ గ్రామం తీవ్ర అతిసారంతో అల్లాడుతోంది. అరకులోయ ఏరియా ఆస్పత్రిలో చికిత్స పొందుతూ పాంగి కాంగో(అతిసారంతో మృతి చెందారు. వాంతులువిరోచనాలతో వారం రోజుల్లో ముగ్గురు మృతి చెందారు. దీంతో గ్రామస్తులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. గ్రామంలో వైద్య శిబిరం ఏర్పాటు చేయాలని గిరిజన సంఘం డిమాండ్ చేస్తోంది.

*బొబ్బిలి గ్రోత్ సెంటర్లో అర్ధరాత్రి అగ్నిప్రమాదం జరిగింది. బెర్రీ అనే పరిశ్రమలో గ్యాస్ లీకవడంతో అగ్నిప్రమాదం సంభంవించిందని స్థానికులు చెబుతున్నారు. ఈ ప్రమాదంలో మంది కార్మికలకు తీవ్రగాయాలయ్యాయి. ఇద్దరు పరిస్థితి విషమంగా ఉంది. క్షతగాత్రులను విజయనగరంలోని ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు.

*ఎచ్చెర్ల మండలంలోనిముద్దాడపేటలో దారుణం జరిగింది. కుటుంబ సభ్యులపై కత్తితో రీసు అప్పన్న దాడి చేశాడు. దాడి అనంతరం నిందితుడు కత్తితో తనను తాను పొడుచుకున్నాడు. అప్పన్న దాడిలో భార్య అత్తమ్మసోదరి అక్కడికక్కడే మృతి చెందగా.. మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. బాధితులను స్థానికులు దగ్గర్లో ఉన్న ఆస్పత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. నిందితుడు మద్యం మత్తులో ఈ దారుణానికి పాల్పడినట్లు పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.