సెయింట్ లూయిస్ హిందూ దేవాలయ మహా కుంభాభిషేక నిర్వహణకు ఆదివారం నాడు నిధుల సమీకరణ కార్యక్రమాన్ని స్థానిక ఆలయ ప్రాంగణంలో ఏర్పాటు చేశారు. 700మందికి పైగా స్థానిక ప్రవాసులు, భక్తులు పాల్గొన్న ఈ కార్యక్రమంలో మిలియన్ డాలర్లు (₹7.5కోట్లు) విరాళాలుగా అందినట్లు ఆలయ కమిటీ ఛైర్మన్ గంగవరపు శ్రీనివాస రజనీకాంత్, అధ్యక్షురాలు డా.రాజ్యలక్ష్మి నాయుడులు తెలిపారు. కార్యక్రమంలో ప్రవాస యువతీయువకుల సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. మే 11-15 తేదీల్లో నిర్వహించే ఈ కుంభాభిషేకాన్ని విజయవంతం చేయవల్సిందిగా నిధుల సమీకరణ కమిటీ అధ్యక్షుడు షారద్ పారిఖ్ కోరారు. అశోక్ కుమార్, ప్రసన్న అయ్యర్, పుట్టగుంట మురళీకృష్ణ, సాక్షి విజయ్, ఇంటూరి శేషు, యార్లగడ్డ కిషోర్, పర్వతనేని శ్రీనివాస్, ఎర్రపోతిన శ్రీనివాస్ తదితరులు నిధుల సమీకరణకు తోడ్పడినట్లు మీడియా సమన్వయకర్త రాజా సూరపనేని తెలిపారు.
సెయింట్ లూయిస్ దేవాలయ కుంభాభిషేకానికి మిలియన్ డాలర్ల విరాళం
Related tags :