Devotional

యాదాద్రిలో మహాకుంభ సంప్రోక్షణ పూర్తి

యాదాద్రిలో మహాకుంభ సంప్రోక్షణ పూర్తి

యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయంలో మహాకుంభ సంప్రోక్షణ పూర్తి అయ్యింది. ఎంతో వైభవంగా మహాకుంభ సంప్రోక్షణ మహోత్సవం జరిగింది. దివ్య విమానంపై సుదర్శన చక్రానికి ముఖ్యమంత్రి కేసీఆర్ సమక్షంలో సంప్రోక్షణ జరిగింది. శ్రీ సుదర్శన స్వర్ణచక్రానికి సీఎం సమక్షంలో యాగజలాలతో రుత్వికులు సంప్రోక్షణ చేశారు. ఆపై ప్రధానాలయం గోపురాలపై కలశాలకు కుంభాభిషేకం, సంప్రోక్షణ చేశారు. రాజగోపురాలపైన స్వర్ణ కలశాలకు 92 మంది రుత్వికులతో సంప్రోక్షణ జరిగింది. సంప్రోక్షణ అనంతరం ప్రధానాలయ ప్రవేశంతో పాటు గర్భాలయంలోని స్వర్ణ ధ్వజస్తంభ సందర్శన ఉంటుంది. సరిగ్గా 12.20 గంటలకు గర్భాలయంలోని మూలవరుల దర్శనం మొదలుకానుంది. సీఎం కేసీఆర్‌ దంపతులు తొలిపూజ చేయనున్నారు. మధ్యాహ్నం 3 గంటల తర్వాత స్వామి వారి సర్వదర్శనానికి భక్తులను అనుమతిస్తారు.
b2
**వైభవంగా శోభాయాత్ర….
యాదాద్రిలోని లక్ష్మీనరసింహస్వామి ఆలయ ఉద్ఘాటన పర్వాలు వైభవంగా కొనసాగుతున్నాయి. గత వారం రోజులుగా బాలాలయంలో కొనసాగుతున్న పంచకుండాత్మక మహాయాగంలో మహాపూర్ణాహుతి సోమవారంతో పూర్తయింది. అనంతరం బంగారు కవచ మూర్తులతో బాలాలయం నుంచి ప్రధానాలయం చుట్టూ శోభాయాత్ర నిర్వహించారు. ఈ శోభాయాత్రలో సీఎం కేసీఆర్‌తో పాటు ఆయన కుటుంబసభ్యులు, పలువురు మంత్రులు పాల్గొన్నారు.
b
b3
b4