NRI-NRT

డాక్టర్‌ రఘురామ్‌కు బ్రిటీష్‌ పురస్కారం

డాక్టర్‌ రఘురామ్‌కు బ్రిటీష్‌ పురస్కారం

బ్రిటిష్‌ ప్రభుత్వం అందించే ప్రతిష్ఠాత్మక ఓబీఈ అవార్డును కిమ్స్‌ ఉషాముళ్లపూడి సెంటర్‌ ఫర్‌ బ్రెస్ట్‌ డిసీజ్‌ ఫౌండర్‌ సీఈఓ డాక్టర్‌ పి.రఘురామ్‌ అందుకున్నారు. విండ్సర్‌ ప్యాలె్‌సలో ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమంలో ప్రిన్స్‌ చార్లెస్‌ చేతుల మీదుగా అవార్డు అందుకున్న పిన్నవయసు భారతీయ వైద్యుడిగా ఆయన రికార్డు సృష్టించారు. ప్రపంచవ్యాప్తంగా ప్రముఖులను ఆహ్వానించే క్వీన్‌ ఎలిజబెత్‌-2 ఆనర్‌ లిస్టులో డాక్టర్‌ రఘురామ్‌ పేరును చేర్చినట్లు లండన్‌ గెజెట్‌లో ప్రచురించారు. బ్రిటిష్‌ రాజకుటుంబం అందించే రెండవ అత్యుత్తమ ర్యాంకింగ్‌గా ఓబీఈ అవార్డుకు గుర్తింపు ఉంది. బ్రెస్ట్‌ క్యాన్సర్‌ కేర్‌, దేశంలో సర్జికల్‌ ఎడ్యుకేషన్‌.. యూకే, భారత్‌ సంబంధాల్లో కృషి వంటి వాటిని పరిగణనలోకి తీసుకొని ఈ అవార్డును అందించారు.