బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ భారత పర్యటన ఖరారైంది. ఈనెల 21న ఆయన లండన్ నుంచి బయల్దేరి నేరుగా గుజరాత్లోని అహ్మదాబాద్కు చేరుకుంటారు. అక్కడ పలు కార్యక్రమాల్లో పాల్గొన్న అనంతరం 22న ఢిల్లీకి చేరుకుంటారు. ఢిల్లీలో ప్రధాని నరేంద్ర మోదీతో భేటీ అవుతారు. ఈ సందర్భంగా ఇద్దరూ పలు కీలక అంశాలపై చర్చలు జరుపుతారని బ్రిటన్ ప్రధాని కార్యాలయం శనివారం ప్రకటించింది. వ్యూహాత్మక రక్షణ, దౌత్య, ఆర్థిక భాగస్వామ్యాలపై ఇద్దరూ చర్చించనున్నారు.