Movies

యూఎస్‌లో భారీ ఎత్తున విడుదల

యూఎస్‌లో భారీ ఎత్తున విడుదల

సూపర్‌స్టార్ మహేశ్ బాబు, పరశురామ్ తొలి కలయికలో తెరకెక్కిన యాక్షన్ థ్రిల్లర్ ‘సర్కారువారి పాట’. మైత్రీ మూవీ మేకర్స్, జీయమ్బీ ఎంటర్ టైన్ మెంట్స్, 14 రీల్స్ ప్లస్ సంయుక్త నిర్మాణంలో ఈ సినిమా రూపొందింది. బ్యాంకింగ్ స్కామ్ నేపథ్యంలో ఆసక్తికరమైన కథాకథనాలతో ఈ మూవీ అభిమానుల్ని అలరించబోతోంది. కీర్తి సురేశ్ కథానాయికగా నటిస్తుండగా.. వెన్నెల కిషోర్, నదియా తదితరులు ఇతర ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. సముద్రఖని విలన్‌గా అదరగొట్టబోతున్నారు. ‘సరిలేరు నీకెవ్వరు’ బ్లాక్ బస్టర్ తర్వాత మహేశ్, ‘గీత గోవిందం’ సూపర్ హిట్ తర్వాత పరశురామ్ చేస్తున్న సినిమా కావడంతో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇంతవరకు విడుదలైన Sarkaruvaari paata సినిమా టీజర్, సింగిల్స్, ట్రైలర్‌కు భారీ రెస్పాన్స్ రావడంతో సినిమాపై మరింత హైపు క్రియేట్ అయింది. మే 12న ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్‌గా ఈ సినిమా థియేటర్స్ లో విడుదల కానుంది. అలాగే.. ఓవర్సీస్‌లో సైతం భారీ ఎత్తున విడుదల కానుంది. ముఖ్యంగా యూఎస్ లో Sarkaruvaari paata చిత్రం మొత్తం 603 పైచిలుకు లొకేషన్స్‌లో అత్యంత గ్రాండ్‌గా విడుదల కానున్నట్టు మేకర్స్ ట్విట్టర్ వేదికగా అఫీషియల్‌గా ప్రకటించారు. యూఎస్ లోని ఫ్లైహై సినిమాస్, శ్లోకా ఎంటర్ టైన్ మెంట్స్, క్లాసిక్ ఎంటర్ టైన్ మెంట్స్ వారు సంయుక్తంగా చిత్రాన్ని రిలీజ్ చేస్తున్నారు. మహేశ్ బాబు కెరీర్ లోనే యూఎస్ లో ఇంత భారీగా విడుదలవడం ఇదే మొదటి సారి. మే 11 నుంచి యూఎస్ లో ప్రీమియర్స్ సందడి మొదలు కానుంది. ‘పోకిరి, అతిథి’ తరహాలోని మహేశ్ బాబు మేకోవర్, స్టైలింగ్ అభిమానుల్ని ఆకట్టుకుంటున్నాయి. మరి Sarkaruvaari paata చిత్రం మహేశ్ కు ఏ స్థాయిలో సక్సెస్ అందిస్తుందో చూడాలి.
https://twitter.com/LinusMediaNL/status/1521642833949691906/photo/1