Movies

అలా కలిసొచ్చింది

Auto Draft

‘రొమాంటిక్‌’ చిత్రంతో తెలుగు తెరకొచ్చిన ఢిల్లీ భామ కేతికా శర్మ. ఆ తర్వాత నాగశౌర్య ‘లక్ష్య’ చిత్రంలో నటించింది. ఆమె తాజా చిత్రం ‘రంగ రంగ వైభవంగా..’ విడుదలకు సిద్ధమవుతున్నది. అరంగేట్రం చేయడమే ఆలస్యం వరుస అవకాశాలు దక్కించుకుంటున్నదీ తార. రాష్ట్ర స్థాయి స్విమ్మర్‌ అయిన కేతికాకు నటి కావాలనే కోరిక బలంగా ఉండేది. ఇంట్లో చెబితే ఏడాది సమయం ఇస్తాం, నటి కాకుంటే మేము చెప్పిన కెరీర్‌ ఎంచుకోవాలని అన్నారట. అయితే ఆ ఏడాదిలోనే పూరి జగన్నాథ్‌ నిర్మించిన ‘రొమాంటిక్‌’ మూవీలో అవకాశం వచ్చింది. అప్పటి నుంచి టాలీవుడ్‌లోనే సెటిలయ్యిందీ నాయిక. ఇటీవల తన కెరీర్‌ గురించి మాట్లాడుతూ…‘ఇష్టమైన రంగంలో ఉండటంలో ఎంతో సంతృప్తి దక్కుతుంది. నాకు నటి కావడం తప్ప మరో లక్ష్యం లేదు. నా కలకు సమయం కలిసొచ్చింది. ప్రస్తుతం తెలుగు సినిమాల మీదే దృష్టి పెట్టా. అయితే అవకాశం వస్తే ఏ భాషలోనైనా నటించేందుకు సిద్ధం. తమిళంలో ఎక్కువ పర్‌ఫార్మెన్స్‌ చేయాలి. తెలుగులో నటించడంతో పాటు కాస్త గ్లామర్‌గా కనిపించాలి. ఇలా ఒక్కో భాషకు నటిగా వైవిధ్యం ప్రదర్శించాల్సి ఉంటుంది’ అని చెప్పింది