బోస్టన్లో NRI-TDP ఆధ్వర్యంలో రెండో రోజు నిర్వహిస్తున్న మహానాడు కార్యక్రమానికి వేలాది సంఖ్యలో తెలుగుదేశం పార్టీ అభిమానులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలివచ్చారు. ఈ సందర్భంగా మహానాడు జరుగుతున్న రాయల్ ప్లాజా సమావేశ మందిరం ఆవరణలో శనివారం సాయంత్రం భారీ ప్రదర్శన నిర్వహించారు. పెద్ద ఎత్తున బాణాసంచా కాలుస్తూ…..ఎన్టీఆర్ విగ్రహాన్ని ఊరేగిస్తూ….జోహార్ ఎన్టీఆర్ అంటూ నినాదాలు ఇచ్చారు. పెద్ద పెద్ద తెలుగు జెండాలు కట్టి మోటార్ సైకిళ్లు, కార్లు హారన్లు మోగిస్తూ కార్యకర్తల సందడి చేశారు. హెలికాప్టర్ ద్వారా ప్రదర్శనపై పూలవర్షం కురిపించారు. వాటికి సంబంధించిన చిత్రాలు ఇవి…
బోస్టన్లో టీడీపీ భారీ ప్రదర్శన-చిత్రాలు
Related tags :