DailyDose

వైసీపీ ప్రభుత్వ హయాంలో పెచ్చుమీరుతున్న దళితులపై దాడులు

వైసీపీ ప్రభుత్వ హయాంలో పెచ్చుమీరుతున్న దళితులపై దాడులు

దళితులను మభ్యపెట్టి వారి ఓట్లతో అధికారంలోకి వచ్చిన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం దళితులపై దాడులు చేయిస్తోందని రాష్ట్ర తెలుగుదేశం పార్టీ కార్యనిర్వహక కార్యదర్శి మన్నవ మోహన కృష్ణ విమర్శించారు. మంగళవారం స్థానిక జే కే సి నగర్ లోని ఆయన కార్యాలయంలో ఏర్పాటుచేసిన మీడియా సమావేశంలో మోహన కృష్ణ మాట్లాడారు. దళిత ప్రజాప్రతినిధుల చేత దళితులపై దాడులు చేస్తూ వైసిపి దారుణాలకు ఒడిగడుతుందన్నారు. రాష్ట్ర మాజీ హోంమంత్రి దళిత ఎమ్మెల్యే నియోజకవర్గంలో అర్ధరాత్రి ప్రాణభయంతో వంగిపురం సర్పంచ్ కుటుంబం ప్రాణాలను చేతిలో పట్టుకుని పారిపోవడం, రాష్ట్ర రాజధానిలో దళిత మహిళ వెంకాయమ్మ కుటుంబ సభ్యులపై దళిత మహిళ శాసనసభ్యురాలి అనుచరులు దాడికి పాల్పడటం అత్యంత పాశవి మన్నారు.దళితులను ఉద్ధరి స్తున్నట్లు ఊకదంపుడు ఉపన్యాసాలు ఇచ్చే దళిత మంత్రి మేరుగ నాగార్జున నియోజకవర్గ పరిధిలోని చుండూరు మండలంలో దళితునిపై దాడి అత్యంత కిరాతకం అన్నారు. పదవుల కోసం తమకు ఓట్లు వేసిన దళిత సహచరులపై దాడులు చేయించుతూ తమ రాజకీయ పబ్బంని వైసిపి ప్రజా ప్రతినిధులు గడుపుకుంటున్నారన్నారు. అమరావతి ఉద్యమంలో దళితులపై దళితుల చేత అట్రాసిటీ కేసులు పెట్టించి రాష్ట్రంలో దళితులపై దమనకాండలకు వైసీపీ శ్రీకారం చుట్టిందన్నారు. దళితులు అన్నివిధాలుగా వైసిపి ప్రభుత్వ హయాంలో అణచివేతకు నేతకు గురవుతున్నారన్నారు. కోనసీమ అల్లర్లలో దళిత మంత్రి ఇంటిపై దాడులు చేయించిన వైసీపీ ప్రభుత్వం దళిత ప్రజాప్రతినిధుల పట్ల కూడా తీవ్ర వివక్ష చూపుతుందన్నారు.