NRI-NRT

పిట్స్ బర్గ్ లో వైభవంగా షిర్డీ సాయినాధుని పల్లకి ఉత్సవం

పిట్స్ బర్గ్ లో వైభవంగా  షిర్డీ సాయినాధుని పల్లకి ఉత్సవం

అమెరికాలో పెన్సిల్వేనియాలోని పిట్స్బర్గ్ సచ్చిదానంద సద్గురు షిరిడి సాయిథుని పల్లకి ఉత్సవం కన్నుల పండుగగా జరిగింది. షిరిడి సాయి గానగ మందిర్ ఆధ్వర్యంలో జులై 16న నిర్వహించిన ఈ వేడుకకు భారీ సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. షిరిడి సాయి గానగ మందిర్ వ్యవస్థాపకులు వెంకట్ దిరిశాల (బాబా వెంకట్) ఆధ్వర్యంలో చెక్క వెంకట సత్యనారాయణ మూర్తి (మూర్తి), లక్ష్మి దంపతులు, శశి చలిమిడి, హరిత బండ్లమూడి, మాల్యాద్రి కొరిపి, సతీష్ చెల్లబోయిన , తిరుమల రెడ్డి అల్ల, రవి, దివ్య, స్రవంతి దురిశేటి, శ్రీకాంత్ ముద్దసాని, సాహు జగ్నయసెన్, ప్రణవన్ త్యాగరాజన్ తదితరులు అహర్నిశలు కృషిచేసి ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించారు. ఈ సందర్భంగా దాదాపు 150 మంది భక్తులు తరలివచ్చి సాయినాథుడి పట్ల తమ భక్తిని చాటుకున్నారు.
Whats-App-Image-2022-07-21-at-8-54-26-AM
చిన్మయ మిషన్ ( పిట్స్బర్గ్ ) ఆలయ ప్రధాన అర్చకులు ధర్మతేజ ఈ పల్లకి ఉత్సవాన్ని నిర్వహించారు. ఈ ఉత్సవం క్రతువులో భాగంగా గణపతి పూజ, పుణ్యాహవచనం, గురు ప్రార్థన, బాబా అభిషేకం (శ్రీ రుద్రప్రశ్నః), బాబా మూల మంత్రం, సంపుటీకరణ సాయి విశేష అర్చన, మహా నైవేధ్య, బాబా హారతి, మంత్ర పుష్పంతో శాస్త్రోక్తంగా ఈ పల్లకి ఉత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా భక్తులు స్రవంతి దురిశేటి, శిరీష వీరం రెడ్డి, దీత్య దీపక్, ఉదయ మేఘరాజ్, రమాదేవి పప్పు, సుజాత మామిడి ప్రదర్శించిన కోలాటం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. షిరిడి సాయి గానగ మందిరం తరపున ఇంత మంచి కార్యక్రమాన్ని నిర్వహించడం ద్వారా అమెరికాలో పుట్టి పెరిగిన ఈ తరం పిల్లలకు షిరిడి సాయినాథుని ఆశీస్సులతో పాటు ఆధ్యాత్మిక భావాన్ని కల్పించిన వెంకట్ దిరిశాల, నళిని దంపతులకు భక్తులు కృతజ్ఞతలు తెలిపారు.
Whats-App-Image-2022-07-21-at-8-54-24-AM
Whats-App-Image-2022-07-21-at-8-54-23-AM
Whats-App-Image-2022-07-21-at-8-54-21-AM
Whats-App-Image-2022-07-21-at-8-54-20-AM
Whats-App-Image-2022-07-21-at-8-54-19-AM
Whats-App-Image-2022-07-21-at-8-54-17-AM
Whats-App-Image-2022-07-21-at-8-54-16-AM