NRI-NRT

పేద విద్యార్ధికి ‘తానా’ ల్యాప్ టాప్ పంపిణి

పేద విద్యార్ధికి ‘తానా’ ల్యాప్ టాప్ పంపిణి

గుంటూరు జిల్లా కాకుమాను గ్రామానికి చెందిన వట్టెం వెంకటేష్ అనే పేద మెరిట్ విద్యార్ధికి తానా ఫౌండేషన్ ద్వారా ల్యాప్ టాప్ ను బహుకరించినట్లు ఫౌండేషన్ ట్రస్టీ సామినేని రవి తెలిపారు. ఈ విద్యార్ధి త్రిపుర నిట్ లో మూడవ సంవత్సరం ఇంజనీరింగ్ చదువుతున్నాడు. ఈ పేద విద్యార్ధి గురించి ప్రవాసాంధ్రుడు ఉప్పుటూరి రాంచౌదరి తానా ఫౌండేషన్ దృష్టికి తీసుకొచ్చారు. వెంటనే స్పందించిన ఫౌండేషన్ ట్రస్టీ దేవినేని లక్ష్మి ల్యాప్ ట్యాప్ ను విద్యార్ధికి విరాళంగా అందించారు.