Devotional

రికార్డు స్థాయిలో శ్రీవారి హుండీ ఆదాయం

రికార్డు స్థాయిలో శ్రీవారి హుండీ ఆదాయం

రికార్డు స్థాయిలో శ్రీవారి హుండీ ఆదాయం
టీటీడీ చరిత్రలో జులైలో శ్రీవారికి రికార్డు స్థాయిలో హుండీ ఆదాయం లభించింది. జులై నెలలో 23.40లక్షల మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు. జులై నెలలో శ్రీవారి హుండీ ఆదాయం రూ.139.33 కోట్లు సమకూరింది. ఈ నెలలోనే 1.07 కోట్ల శ్రీవారి లడ్డూలు విక్రయించారు. జూలై నెల మొత్తం శ్రీవారికి 10.97లక్షల మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. మార్చిలో 19.72 లక్షల మంది నుంచి రూ.128.61 కోట్లు, ఏప్రిల్‌ లో 20.62 లక్షల మంది ద్వారా రూ.127.63 కోట్లు హుండీ ఆదాయం సమకూరింది. అలాగే మే నెలలో 22.68 లక్షల మంది శ్రీవారిని దర్శించుకోగా రూ.130.29 కోట్లు లభించింది. జూన్‌ నెలలో 23.23 లక్షల మంది భక్తులు రూ.123.74 కోట్ల కానుకలు సమర్పించారు. జూన్‌లో హుండీ ఆదాయం కాస్త తగ్గినప్పటికీ, మే నెలలో రికార్డుగా ఉన్న రూ.130.29 కోట్లను జూలైలో దాటేసింది. తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. నేడు శ్రీవారి దర్శనం కోసం భక్తులు 16 కంపార్ట్‌మెంట్లలో వేచి ఉన్నారు. శ్రీవారి సర్వదర్శనానికి 15 గంటల సమయం పడుతోంది. బుధవారం తిరుమల శ్రీవారిని 74,497 మంది భక్తులు దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. 36,244 మంది భక్తులు స్వామివారికి తలనీలాలు సమర్పించారు. నిన్న శ్రీవారి హుండీ ఆదాయం రూ.5.15 కోట్లు వచ్చినట్టు తిరుమల తిరుపతి దేవస్థానం వెల్లడించింది.

దుర్గమ్మ ఆలయంలో ఘనంగా పవిత్రోత్సవాలు ప్రారంభం
ప్రముఖ పుణ్యక్షేత్రం విజయవాడ కనకదుర్గమ్మ ఆలయంలో పవిత్రోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ప్రతి ఏడాది శ్రావణమాసంలో పవిత్రోత్సవాలు నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. పవిత్రోత్సవాలు సందర్భంగా ఆలయంలో అన్ని ఆర్జిత సేవలను అధికారులు నిలిపివేశారు. అమ్మవారికి స్తన్నపనది కార్యక్రమాల అనంతరం దర్శనానికి అనుమతి ఇచ్చారు. పవిత్రోత్సవాలు సందర్భంగా 9 గంటలకు అమ్మవారి దర్శనం భాగ్యం కలిపించారు. పవిత్రాలను అర్చక స్వాములు ఆలయంలోని అన్ని విగ్రహాలకు అలంకరించనున్నారు.