NRI-NRT

పద్మశ్రీ డా.పద్మజారెడ్డిని సత్కరించిన తెలంగాణా కల్చరల్ సొసైటీ

పద్మశ్రీ డా.పద్మజారెడ్డిని సత్కరించిన తెలంగాణా కల్చరల్ సొసైటీ

పద్మశ్రీ గ్రహీత డా.గడ్డం పద్మజారెడ్డిని తెలంగాణ కల్చరల్ సొసైటీ (సింగపూర్) కార్యవర్గం సత్కరించింది. నాలుగు దశాబ్దాలుగా కూచిపూడి నృత్యాన్ని వ్యాప్తి చేయడానికి కృషి చేస్తున్న ఆమెను సత్కరించడం ఆనందంగా ఉందని కార్యవర్గ సభ్యులు పేర్కొన్నారు. అనంతరం ఆమె తెలంగాణ కల్చరల్ సొసైటీ చేస్తున్న సేవలను కొనియాడారు. కార్యక్రమంలో అధ్యక్షులు నీలం మహేందర్, కోశాధికారి లక్ష్మణ్ రాజు కల్వ, ఉపాధ్యక్షురాలు సునీత రెడ్డి మిర్యాల, ఉపాధ్యక్షులు గర్రెపల్లి శ్రీనివాస్, ప్రాంతీయ కార్యదర్శులు, జూలూరి సంతోష్, రోజా రమణి చకిలం, నంగునూరి వెంకట రమణ మరియు కార్య వర్గ సభ్యులు కాసర్ల శ్రీనివాస రావు, రవి క్రిష్ణ విజ్జాపూర్, శశి ధర్ రెడ్డి, భాస్కర్ నడికట్ల తదితరులు పాల్గొన్నారు.