మనీలాండరింగ్ కేసులో బాలీవుడ్ నటి జాక్వెలిన్ ఫెర్నాండెజ్ ఢిల్లీలోని పాటియాలా కోర్టుకు హాజరయ్యారు. నిందితుడు సుఖేష్ చంద్రశేఖర్కు సంబంధించిన 200 కోట్ల మనీలాండరింగ్ కేసులో జాక్వెలిన్ ఫెర్నాండెజ్కు ఢిల్లీ కోర్టు మధ్యంత బెయిల్ మంజూరు చేసిన విషయం తెలిసిందే. నవంబర్ 10వ తేదీ వరకు కోర్టు మధ్యంత బెయిల్ మంజూరు చేసింది. ఈ బెయిల్ నేటితో ముగియనుంది. ఈ నేపథ్యంలో ఆమె గురువారం ఢిల్లీలోని పాటియాలా కోర్టుకు హాజరయ్యారు. ఈ కేసులో రెగ్యులర్ బెయిల్, ఇతర పెండింగ్ దరఖాస్తులపై నేడు కోర్టు విచారణ చేపట్టనుంది.జాక్వెలిన్కు సుఖేష్ చంద్రశేఖర్ రూ.7 కోట్లకు పైగా విలువైన ఆభరణాలను బహుమతిగా ఇచ్చారని ఆరోపణలు వచ్చిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆగస్టు 17న ఢిల్లీ కోర్టులో చంద్రశేఖర్పై దర్యాప్తు సంస్థ దాఖలు చేసిన అనుబంధ చార్జ్ పిటిషన్లో ఫెర్నాండెజ్ పేరును నిందితురాలిగా పేర్కొంది. ఈ కేసుకు సంబంధించి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఇప్పటికే పలుమార్లు ఆమెని విచారణ చేసిన విషయం తెలిసిందే