Politics

తెలంగాణకు ఆంధ్రా పార్టీలు అవసరమా?

Auto Draft

ఢిల్లీ పాలకులు ఎంత విషం చిమ్మినా తెలంగాణలో అభివృద్ధి ఆగదని మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. ఆదివారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ ఆంధ్రా పార్టీలు తెలంగాణకు అవసరమా? అని ప్రశ్నించారు. పాదయాత్రలతో కొందరు.. కోతి వేషాలతో కేఏ పాల్ తెలంగాణకు వస్తున్నారని అన్నారు. మళ్లీ సమైక్య పాలన అవసరంలేదన్నారు. నరేంద్రమోదీ ప్రధానా? లేక ప్రతిపక్ష నాయకుడా? అని ప్రశ్నించారు. జీఎస్టీ తాము కడితే ఫలాలు మాత్రం గుజరాత్‌కా.. అని మండిపడ్డారు. రామగుండంలోనూ బీజేపీకి రాజకీయలేనా అని మంత్రి గంగుల కమలాకర్ ప్రశ్నించారు.