Politics

యాత్రకు ముందు తిరుమలలో బస చేయనున్న లోకేష్

యాత్రకు ముందు తిరుమలలో   బస చేయనున్న లోకేష్

టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ ఈ నెల 25న రాత్రికి తిరుమలకు రానున్నారు.

కడప నుంచి రోడ్డు మార్గం గుండా లోకేష్ తిరుమలకు చేరుకోనున్నారు.

రాత్రికి తిరుమలలోనే బస చేయనున్నారు.

26న ఉదయం శ్రీవారిని టీడీపీ నేత దర్శించుకోనున్నారు.

యువగళం పాదయాత్ర ప్రారంభానికి ముందు స్వామి వారి ఆశీస్సులు పొందనున్నారు.

దర్శనాంతరం లోకేష్ తిరుమల నుంచి నేరుగా కుప్పంకు వెళ్ళనున్నారు.