DailyDose

అందరి ఫోన్‌లు ట్యాప్ చేస్తున్నారు..

అందరి ఫోన్‌లు ట్యాప్ చేస్తున్నారు..

★ సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ .. జగన్ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు.

ఈ సందర్భంగా శనివారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ..

★ ప్రభుత్వం జీవో1 ద్వారా ప్రజల్ని కన్ఫ్యూజ్ చేస్తోందని అన్నారు.

★ నిన్న యూటిఎఫ్ వాళ్లు గన్నవరంలోని దర్మస్థలంలో దీక్ష పెట్టుకుంటే ప్రభుత్వానికి వచ్చిన ఇబ్బంది ఏంటని ప్రశ్నించారు.

★ జీవో 1తో అనేక ఇబ్బందులు పెడుతున్నారని మండిపడ్డారు.

★ టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ యువగళం పాదయాత్రపై కేసులు పెడుతున్నారని, మైక్ లేకుండా ఎవ్వరైనా పాదయాత్ర చేస్తారా? అని నిలదీశారు.

★ కింద మాట్లాడవద్దంటే బాల్కనీ ఎక్కి లోకేష్ మాట్లాడ వలసి వచ్చిందన్నారు. మీరేమైన పోలీసులా? అని ప్రశ్నించారు..

★ కోర్టులు ఉండబట్టి సరిపోయింది.. లేక పోతే ఈ మూర్కుడు సీఎం జగన్ ఇంకా ఎన్ని తిప్పలు పెట్టేవారోనని రామకృష్ణ వ్యాఖ్యానించారు.

★ సీనియర్ ఐఎఎస్‌లు కూడా చివాట్లు తింటున్నారని అన్నారు.

★ అందరి ఫోన్‌లు ట్యాంపరింగ్ చేస్తున్నారని, వైసీపీ ఎమ్మెల్యేలు ఇదే చెపుతున్నారన్నారు.

★ ఒక శాసనసభ్యుడిని బజారులో ఈడ్చుకు వెళతామని వాళ్ళు మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

★ వచ్చే అసెంబ్లీ సమావేశాల నాటికి ఛలో అసెంబ్లీకి పిలుపు ఇవ్వాలని, అన్నిపక్షాలు కచ్చితంగా ఈ కార్యక్రమంలో పాల్గొనాలని పిలుపిచ్చారు.

★ ఒక నియంత పాలన ఈ రాష్ట్రంలో జరుగుతోందని రామకృష్ణ వ్యాఖ్యానించారు.