* పెరిగిన బంగారం ధర
హైదరాబాద్ బులియన్ మార్కెట్లో బంగారం ధర మళ్లీ పెరిగింది. 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేట్ రూ. 220 పెరిగి రూ.59,070గా ఉంది. 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.200 పెరిగి రూ.54,150కి చేరింది. కేజీ వెండి ధర రూ. 900 పెరిగి రూ. 75,700గా నమోదైంది. తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో ఇవే ధరలు కొనసాగుతున్నాయి.
* రికార్డు స్థాయిలో పన్నులు చెల్లించిన ప్రభుత్వ రంగ సంస్థలు
ఈ ఏడాది మార్చితో ముగిసిన ఆర్థిక సంవత్సరంలో భారతీయ కంపెనీలు రికార్డు స్థాయిలో ఆదాయాన్ని, లాభాలను సాధించాయి. దాంతో దేశీయ కార్పొరేట్ల పన్ను చెల్లింపులు కూడా పెరిగాయి. ఏస్ ఈక్విటీ తాజా డేటా ప్రకారం, బీఎస్ఈ 500 ఇండెక్స్లోని 500 లిస్టెడ్ కంపెనీలు 2022-23లో మొత్తం రూ. 3.64 లక్షల కోట్ల పన్నులు చెల్లించాయి. ఇది అంతకుముందు 2021-22లో చెల్లించిన రూ. 3.41 లక్షల కోట్ల కంటే 7 శాతం ఎక్కువ. అందులో ప్రభుత్వ రంగ సంస్థలు(పీఎస్యూ) రూ. 1.08 లక్షల కోట్లను పన్నుల రూపంలో చెల్లించాయి. బీఎస్ఈ 500లో అత్యధికంగా పన్ను చెల్లించిన టాప్-10 వ్యాపార సంస్థల జాబితాను పరిశీలిస్తే, పీఎస్యూల తర్వాత టాటా గ్రూప్ సంస్థ రూ. 30,000 కోట్ల కంటే ఎక్కువ పన్నులు కట్టింది.
* 6 నెలల్లో బిర్యానీ ఎన్ని లక్షల ఆర్డర్స్ చేశారో తెలుసా?
హైదరాబాద్ బిర్యానీ ఎంత ఫేమసో కొత్తగా చెప్పనక్కర్లేదు. వివిధ రాష్ట్రాల ప్రజలకే కాదు.. విదేశీయులకు కూడా మన హైదరాబాద్ బిర్యానీ ఫేవరెట్. భాగ్యనగరానికి వచ్చిన కొత్త వాళ్లెవరూ బిర్యానీని టేస్ట్ చేయకుండా వెళ్లరు. అంత ఫేమస్ మరి హైదరాబాద్ బిర్యానీ. అయితే ఆహా ఏమి రుచి.. తినరా బిర్యానీ మైమరచి.. అనుకుంటూ హైదరాబాద్ నగరవాసులు బిర్యానీని తెగ తింటున్నారట.ఈ ఏడాది మొదటి 6 నెలల్లో 72 లక్షల బిర్యానీలు ఆరగించారట మన భాగ్యనగర ప్రజలు. ఇవన్నీ ఆన్లైన్లో ఇచ్చిన ఆర్డర్లే. రెస్టారెంట్లో, ఇంట్లో తినేవారిని కలిపితే ఈజీగా కోటి దాటుతుంది. జులై 2 ప్రపంచ బిర్యానీ దినోత్సవం సందర్భంగా స్విగ్గీ వెల్లడించిన వివరాల ప్రకారం.. దేశవ్యాప్తంగా ప్రతి ఐదింటిలో ఒకటి హైదరాబాద్ బిర్యానీ ఆర్డరే కావడం విశేషం. ఎక్కువగా కూకట్పల్లి ప్రజలు బిర్యానీ ఆరగిస్తున్నారు. తర్వాతి స్థానాల్లో మాదాపూర్, బంజారాహిల్స్, గచ్చిబౌలి ప్రాంతాలు ఉన్నాయి. నగరవ్యాప్తంగా 15 వేల రెస్టారెంట్లు బిర్యానీ రుచులను అందిస్తున్నాయి.
* జీఎస్టీ వసూళ్లు 1.61 లక్షల కోట్లు
జూన్ నెలలో కౌ1.61 లక్షల కోట్ల GST వసూలైనట్లు ఆర్థిక శాఖ వెల్లడించింది. గతేడాది జూన్తో పోల్చితే 12% వృద్ధి నమోదైనట్లు పేర్కొంది. ఇందులో CGST <31,013 కోట్లు, SGST 38,292 కోట్లు, IGST <80,292 కోట్లు వచ్చినట్లు తెలిపింది. GST ప్రారంభించినప్పటి నుంచి వసూళ్లు 1.60 లక్షల కోట్లు దాటడం ఇది నాలుగోసారి. మహారాష్ట్రలో అత్యధికంగా √26,098 కోట్లురాగా, తెలంగాణలో 4,681 కోట్లు, ఏపీలో 3,477 కోట్లు వసూలైంది.
* వీనర్ జైటుంగ్’ పత్రిక ముద్రణ నిలిపివేత
ప్రపంచం లోని పురాతన వార్తాపత్రిక ల్లో ఒకటి వియన్నాకు చెందిన వీనర్ జైటుంగ్ (Wiener Zeitung). మూడు దశాబ్దాల తరువాత దాని రోజువారీ ముద్రణ ను శుక్రవారంతో ముగించింది. ఈ మేరకు అధికారిక ప్రకటన విడుదలైంది. వియన్నా డైరియం పేరుతో మొదటిసారిగా 8 ఆగస్టు 1703లో ఈ పేపర్ ప్రచురితం ప్రారంభమైంది. 320 సంవత్సరాలు సుదీర్ఘ కాలం పాటు దిగ్విజయంగా దీని దినపత్రిక ముద్రణ కొనసాగింది. 12 మంది అధ్యక్షులు, 10 మంది చక్రవర్తులు, రెండు దేశాలు, ఒకే పత్రిక అంటూ చివరిరోజు ఎడిషన్ మొదటి పేజీలో వీనర్ జైటుంగ్ ప్రచురించింది. అయితే, కేవలం ప్రింటింగ్ ఎడిషన్ మాత్రమే నిలిపివేస్తున్నామని, ఆన్లైన్ ఎడిషన్ కొనసాగుతుందని యాజమాన్యం తెలిపింది.
* అమెరికా ప్రభుత్వం తొలి ‘ఫ్లయింగ్ కారుకు ఆమోదం
ప్రపంచంలోనే తొలి ఎగిరే కారుకు అమెరికా ప్రభుత్వం ఆమోదం తెలిపింది. కాలిఫోర్నియాకు చెందిన అలీఫ్ ఏరోనాటిక్స్ కంపెనీ తయారు చేసిన ‘మాడల్ ఏ’ కారు రోడ్డుపైనా నడువగలదు.. గాలిలో ఎగురగలదు.ఒక్కసారి ఫుల్ చార్జింగ్ చేస్తే 177 కిలోమీటర్ల వరకు గాలిలో ప్రయాణించొచ్చు. అదే రోడ్డు మీద అయితే 322 కిలోమీటర్లు ప్రయాణిస్తుంది. పూర్తిగా ఎలక్ట్రిక్ వాహనమైన ఈ కారు ధర రూ.2.46 కోట్లు
* విశాఖ ఉక్కు కర్మాగారంలో తగ్గుతున్న ఉద్యోగుల సంఖ్య
విశాఖ ఉక్కు కర్మాగారంలో ఏడాదిలో సుమారు వెయ్యి మంది ఉద్యోగులు తగ్గిపోయారు. 2021 డిసెంబరు 31 నాటికి 15,928 మంది పనిచేస్తుండగా, 2022 డిసెంబర్ 31 నాటికి ఆ సంఖ్య 14,935కి పడిపోయింది. కేంద్ర ఉక్కుశాఖ వార్షిక నివేదిక ఈ విషయాన్ని వెల్లడించింది.2021 మార్చి 31 నుంచి డిసెంబరు 31 మధ్యకాలంలో దీని నెట్వర్త్ రూ.2,464 కోట్ల నుంచి రూ.3,240 కోట్లకు పెరగ్గా, 2022లో ఇదే సమయంలో రూ.3,175 కోట్ల నుంచి రూ.479 కోట్లకు పడిపోయింది. గత ఏడాది ఏప్రిల్ నుంచి డిసెంబర్ మధ్యకాలంలో రూ.15,618 కోట్ల వ్యాపారం చేసిన ఈ సంస్థ 2022లో రూ.2,751.34 కోట్ల నికర నష్టాన్ని చవిచూసింది. 2021 ఏప్రిల్ – డిసెంబర్ మధ్యకాలంలో రూ.19,401 కోట్ల వ్యాపారం చేసి రూ.790 కోట్ల నికర లాభాన్ని సాధించగా, 2022లో నష్టాల బారిన పడింది.
* దేశీయ అతిపెద్ద నాలుగో బ్యాంకుగా హెచ్డీఎఫ్సీ
ప్రపంచంలోనే అతిపెద్ద బ్యాంక్ల సరసన హెచ్డీఎఫ్సీ, హెచ్డీఎఫ్సీ బ్యాంక్ల విలీన సంస్థ చేరింది. శనివారం నుంచి విలీన సంస్థ పనిచేయనుండగా, జులై 13 న హెచ్డీఎఫ్సీ షేర్లు మార్కెట్ నుంచి డీలిస్ట్ కానున్నాయి. కొత్త హెచ్డీఎఫ్సీ బ్యాంక్ ప్రపంచంలోనే నాలుగో అతిపెద్ద బ్యాంక్గా మారనుంది. యూఎస్, చైనా బ్యాంకులకు ఛాలెంజ్ చేసే స్థాయికి ఎదగనుంది. మార్కెట్ క్యాప్ ప్రకారం, గ్లోబల్గా టాప్ బ్యాంక్గా జేపీ మోర్గాన్ చేజ్ ఉంది. ఆ తర్వాత ప్లేస్లో ఇండస్ట్రియల్ అండ్ కమర్షియల్ బ్యాంక్ ఆఫ్ చైనా, బ్యాంక్ ఆఫ్ అమెరికా ఉన్నాయి. హెచ్డీఎఫ్సీ బ్యాంక్ – హెచ్డీఎఫ్సీ విలీన సంస్థ నాలుగో ప్లేస్కు చేరుకుంది. కిందటేడాది ఏప్రిల్ 4 న దేశ కార్పొరేట్ సెక్టార్లోనే అతిపెద్ద డీల్ కుదిరిన విషయం తెలిసిందే. హోమ్లోన్లను ఇచ్చే అతిపెద్ద ఎన్బీఎఫ్సీ కంపెనీ హెచ్డీఎఫ్సీని హెచ్డీఎఫ్సీ బ్యాంక్ టేకోవర్ చేసింది. ఈ డీల్ విలువ 40 బిలియన్ డాలర్లు. ఈ రెండు సంస్థలు విలీనంతో 172 బిలియన్ డాలర్ల విలువైన బ్యాంక్ క్రియేట్ అయ్యింది ఈ బ్యాంక్ అసెట్ వాల్యూ రూ.18 లక్షల కోట్లు.
* కేవలం 820 కే గ్యాస్ సిలిండర్..!
ప్రతీ నెల ఒకటో తేదిన గ్యాస్ సిలిండర్ ధరల్లో మార్పులు జరుగుతుంటాయి. ఈ ధరలు అంతర్జాతీయ ముడి చమురు రేట్లపై ఆధారపడి ఉంటాయి. అయితే.. గత కొంత కాలంగా LPG గ్యాస్ సిలిండర్ ధరల్లో ఎలాంటి మార్పులు జరగలేదు. దీంతో సామాన్య ప్రజలు మండిపడుతున్నారు. ఈ క్రమంలోనే ఆయిల్ కంపెనీలు వినియోగదారులకు ఓ శుభవార్త అందించింది. ఇక నుంచి గ్యాస్ సిలిండర్ కేవలం రూ. 820 తీసుకోవచ్చని తెలిపింది. అదేలా అనుకుంటున్నారా