WorldWonders

ఈ రెస్టారెంట్​లో ఒకేసారి ఎంత మంది భోజనం చేయోచ్చో తెలుసా?

ఈ రెస్టారెంట్​లో ఒకేసారి ఎంత మంది భోజనం చేయోచ్చో తెలుసా?

పిపా యువాన్.. ప్రపంచంలోనే అతిపెద్ద రెస్టారెంట్​. ఇది చైనాలోని నాన్ జిల్లా చాంగ్‌కింగ్ నగర శివార్లలోని కొండ ప్రాంతాల్లో ఉంది ఈ రెస్టారెంట్​. దీని ప్రత్యేకతల గురించి తెలుసుకుంటే నోరెళ్లబెట్టాల్సిందే. వంటకాలను రుచి చూస్తే వాహ్​ అనాల్సిందే. ఈ రెస్టారెంట్​లో మొత్తం 900 పైగా టేబుళ్లు ఉన్నాయి. 3,300 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉన్న ఈ రెస్టారెంట్​లో 5,800 మంది ఒకేసారి భోజనం చేయవచ్చు. 2022లో గిన్నిస్​ బుక్​ ఆఫ్​ రికార్డ్స్​లోనూ చోటు సంపాదించింది ఈ రెస్టారెంట్​.చైనాలోని పాపులర్​ వంటకాలన్నీ ఈ రెస్టారెంట్​లో దొరుకుతాయి. ఇక్కడ వందలాది మంది వెయిటర్లు, వంట మనుషులు, ఛెఫ్​లు ఉంటారు. వీరితో పాటు 25 మంది క్యాషియర్స్ కూడా ఉంటారు. 24 గంటల పాటు ఈ రెస్టారెంట్​ తెరిచే ఉంటుంది. రాత్రి సమయంలోనూ ఈ రెస్టారెంట్​కు వస్తుంటారు కస్టమర్​లు. ఆ సమయంలో వివిధ రకాల విద్యుత్​ దీపాల వెలుగుల్లో రెస్టారెంట్ మరింత అందంగా కనిపించడమే దీనికి కారణం.బుక్​ చేసుకున్న టేబుళ్లను కస్టమర్​లకు చూపించేందుకు ఇక్కడ ప్రత్యేకంగా కొంత మంది సిబ్బంది కూడా ఉంటారు. ఆర్డర్​ ఇచ్చిన డిష్​ కోసం కస్టమర్​ల దాదాపుగా అరగంట సేపు ఆగాల్సిందే. రోజు రోజుకి ఈ రెస్టారెంట్​కు వచ్చే వినియోగదారుల సంఖ్య విపరీతంగా పెరుగుతూ వస్తోంది. ఇక వేసవి కాలంలో రిజర్వేషన్ లేకుండా ఇక్కడి వస్తే మాత్రం కాస్త ఇబ్బంది పడాల్సిందే. ఆ​ సీజన్​లో​​ ఇక్కడ టేబుల్​ దొరకడమే కష్టంగా ఉంటుంది. విపరీతంగా వచ్చే ప్రజలతో.. ఈ రెస్టారెంట్​ జాతరను తలపిస్తూ ఉంటుంది. ఈ రెస్టారెంట్​కు ఇంతమంది కస్టమర్​లు వస్తుంటే.. అక్కడున్న సిబ్బంది ఆర్డ​ర్​లను రుచిగా ఇస్తారా లేదా అన్న అనుమానం మనకు కలగవచ్చు. కానీ ఇక్కడికి ఎంత మంది వచ్చిన రుచికరమైన ఆహారం అందిస్తారు రెస్టారెంట్​ సిబ్బంది. కస్టమర్​ల నుంచి కూడా ఈ రెస్టారెంట్​ మంచి స్పందనే వస్తోంది.