Politics

ఇండియా చైర్ పర్సన్‌గా సోనియా గాంధీ

ఇండియా చైర్ పర్సన్‌గా సోనియా గాంధీ

మహారాష్ట్ర రాజధాని ముంబై వేదికగా ఆగస్టు 31, సెప్టెంబరు 1 తేదీల్లో జరిగే విపక్ష పార్టీల కూటమి “ఇండియా” మీటింగ్ లో కీలక నిర్ణయాలను ప్రకటించనున్నారు. “ఇండియా” కూటమికి సారధ్యం వహించే నేతలు ఎవరు అనేది ఆ సమావేశంలో తేలిపోనుంది. జాతీయ మీడియాలో వస్తున్న కథనాల ప్రకారం.. ఇండియా కూటమి కన్వీనర్‌ పోస్టులో బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్‌ ను నియమించనున్నారు. కూటమి ఛైర్‌పర్సన్- కన్వీనరు గా సోనియా గాంధీని ఎంపిక చేస్తారని అంటున్నారు.ఛైర్‌పర్సన్ హోదాలో ఇండియా కూటమిలోని 11 మంది సభ్యుల సమన్వయ కమిటీకి ఆమె సారధ్యం వహిస్తారని చెబుతున్నారు. ఒకవేళ ఆ పదవిని చేపట్టేందుకు సోనియా గాంధీ ఆసక్తి చూపకుంటే.. ఆమె సూచించే నేతకు ఆ బాధ్యతలను అప్పగించే అవకాశం ఉందనే అంచనాలు వెలువడుతున్నాయి. కూటమిలోని పార్టీల మధ్య రాష్ట్రాలవారీగా సీట్ల పంపిణీ ఎలా జరగాలి ? ఎలా సమన్వయం చేసుకుంటూ ముందుకు సాగాలి ? అనే దానిపైనా “ఇండియా” మీటింగ్ లో చర్చ జరగనుంది.