Politics

గంటా శ్రీనివాసరావుకు హైకోర్టులో ఊరట

గంటా శ్రీనివాసరావుకు హైకోర్టులో ఊరట

మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావుకు గృహనిర్బంధాలు, 151 సీఆర్‌పీసీ నోటీసుల నుంచి హైకోర్టులో ఊరట లభించింది. తన స్వేచ్ఛకు పోలీసులు భంగం కలిగిస్తున్నారని గంటా శ్రీనివాసరావు ఉన్నత న్యాయస్థానంలో పిటిషన్ దాఖలు చేశారు. విచారణ చేపట్టిన హైకోర్టు.. నాయకుల కదలికలపై పోలీసుల నిఘా, గృహనిర్బంధంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. పిటిషన్‌పై విచారణ సందర్భంగా పోలీసుల తీరును హైకోర్టు తప్పుబట్టింది. ఈకేసులో ప్రభుత్వ వాదనలు వినేందుకు కూడా న్యాయస్థానం అంగీకరించలేదు. రెండు వారాల తర్వాత విషయాన్ని లిస్ట్‌ చేయాలని ఆదేశించింది. అప్పటి వరకు పిటిషనర్‌ స్వేచ్ఛకు భంగం కలిగించవద్దని పోలీసులను ఆదేశించింది.

👉 – Please join our whatsapp channel here –

https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z