NRI-NRT

శ్రీలంక వెళ్లాలనుకునే వారికి శుభవార్త

శ్రీలంక వెళ్లాలనుకునే వారికి శుభవార్త

పర్యాటకాన్ని ప్రోత్సహించే ఉద్దేశంతో శ్రీలంక ప్రభుత్వం (Sri lanka) కీలక నిర్ణయం తీసుకుంది. భారత్‌ సహా ఏడు దేశాల టూరిస్టులకు వీసా లేకుండానే పర్యాటక ప్రదేశాల సందర్శనకు అనుమతివ్వాలని నిర్ణయిచింది. చైనా, రష్యా, మలేసియా, జపాన్‌, ఇండోనేసియా, థాయ్‌లాండ్‌ దేశాలూ ఇందులో ఉన్నాయి. పైలట్‌ ప్రాజెక్ట్‌గా దీన్ని చేపట్టనుంది. ఈ మేరకు శ్రీలంక కేబినెట్‌ నిర్ణయం తీసుకున్నట్లు ఆ దేశ విదేశీ వ్యవహారాల మంత్రి అలీ సబ్రీ వెల్లడించారు. తక్షణమే ఈ నిర్ణయం అమల్లోకి వస్తుందని ఆయన తెలిపారు. ఈ పైలట్‌ ప్రాజెక్ట్‌ వచ్చే ఏడాది మార్చి 31 వరకు అమల్లో ఉంటుందన్నారు.ద్వీప దేశమైన శ్రీలంకకు పర్యాటకమే ప్రధాన ఆదాయ వనరు. విదేశీ మారకం దీని ద్వారానే సమకూరుతోంది. కొవిడ్‌-19కు తోడు ఆ దేశంలో నెలకొన్న రాజకీయ, ఆర్థిక సంక్షోభం మూలంగా పర్యాటకుల రాక తగ్గింది. ఈ నేపథ్యంలో పర్యాటక రంగానికి ఊపిరి పోయాలని ఆ దేశం నిర్ణయించింది. 2023 సంవత్సరానికి గాను 20 లక్షల మందిని ఆకర్షించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఇందులో భాగంగా వీసా ఫ్రీ నిర్ణయం తీసుకుంది. గత కేబినెట్‌ సమావేశంలోనే ఈ అంశం చర్చకు వచ్చింది. తొలుత 5 దేశాలకు వీసా ఫ్రీ ట్రావెల్‌కు అనుమతివ్వాలని భావించారు. దాన్ని తాజాగా 7కు పెంచుతూ కేబినెట్‌లో నిర్ణయం తీసుకున్నారు.

👉 – Please join our whatsapp channel here –

https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z