49 సంవత్సరాల క్రితం ఏర్పడిన బృహత్తర వాషింగ్టన్ తెలుగు సాంస్కృతిక సంఘం దసరా-దీపావళి వేడుకలు ఈ ఏడాది అధ్యక్షుడు లాం కృష్ణ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. అక్కినేని శతజయంతి సందర్భంగా ఘననివాళి అర్పించారు. ప్రవాసులు సాంప్రదాయ దుస్తుల్లో హాజరయి సందడి చేశారు. ప్రముఖ సినీనటి సంయుక్త మీనన్ సభికుల ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చారు. చిన్నారులు, మహిళలతో ఫొటోలు దిగుతూ సందడి చేశారు. అధ్యక్షుడు లాం కృష్ణ మాట్లాడుతూ 2024లో GWTCS స్వర్ణోత్సవాలఅకు వెన్నుదన్నుగా నిలిచిన దాతలకు కృతఙ్ఞతలు తెలిపారు. భారతీయతను నిలుపుకోవటయే సంస్థ ఆదర్శమన్నారు.
కార్యవర్గ సభ్యులు చంద్ర మాలావతు, రవి అడుసుమిల్లి, సుశాంత్ మన్నే, యాష్ బొద్దులూరి, భాను మాగులూరి, సుష్మ అమృతలూరి, ఉమాకాంత్, విజయ్ అట్లూరి, రాజేష్ కాసారనేని, యడ్ల హేమప్రసాద్, మూల్పూరి వెంకట్రావు, సతీష్ వేమన, శ్రీవిద్య సోమ, మన్నే సత్యనారాయణ, రామ్ చౌదరి ఉప్పుటూరి, నాగ్ నెల్లూరి, అనిల్ ఉప్పలపాటి, సత్య సూరపనేని, సుధీర్ కొమ్మి, నరేన్ కొడాలి, సాయి కాంత, తేజ రాపర్ల తదితరులు పాల్గొన్నారు. మయూరి ఇండియన్ రెస్టారెంట్ (ప్రదీప్ గౌర్నేని)కి కార్యవర్గం ప్రత్యేక కృతఙ్ఞతలు తెలిపింది.
👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z