నాలుగేళ్ల తర్వాత షారుక్ ఖాన్ (Shah Rukh Khan) ఈ ఏడాది ‘పఠాన్’తో ప్రేక్షకులను పలకరించి భారీ హిట్ను అందుకున్నారు. సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం రూ.1000 కోట్లకు (గ్రాస్) పైగా వసూళ్లు చేసి ఈ బాలీవుడ్ బాద్షాకు తిరుగులేదని నిరూపించింది. అలాగే దీని తర్వాత ‘జవాన్’తో మరోసారి హిట్ను తన ఖాతాలో వేసుకున్నారు. ఇక ఈ రెండు చిత్రాల విడుదలకు ముందు జమ్ములోని ప్రఖ్యాత వైష్ణోదేవి ఆలయాన్ని షారుక్ సందర్శించారు. ఇప్పుడు ‘డంకీ’ (Dunki) విడుదలకు ముందు కూడా ఆయన ఈ ఆలయానికి వెళ్లారు.
‘జవాన్’ (Jawan) విడుదలకు ముందు గతేడాది డిసెంబర్ 12న షారుక్.. వైష్ణోదేవి ఆలయంలో పూజలు నిర్వహించారు. అలాగే ‘పఠాన్’కు ముందు ఆగస్టులో మరోసారి అక్కడికి వెళ్లారు. ఇప్పుడు ‘డంకీ’ విడుదల నేపథ్యంలో మూడోసారి ఈ ఆలయాన్ని సందర్శించారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియోను ఆయన అభిమానులు షేర్ చేస్తున్నారు. సినిమా విడుదలకు ముందు ఈ ఆలయాన్ని దర్శించడం ఆయన సెంటిమెంట్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఇప్పుడు ‘డంకీ’ కూడా భారీ విజయాన్ని సొంతం చేసుకుంటుందని ఫ్యాన్స్ ఆశిస్తున్నారు.
రాజ్ కుమార్ హిరాణీ దర్శకత్వంలో రానున్న ‘డంకీ’పై ఇప్పటికే అభిమానుల్లో భారీగా ఆశలు నెలకొన్నాయి. భారత్ నుంచి ఎన్నో దేశాలు దాటి యూకేలోకి అక్రమంగా ప్రవేశించాలని ప్రయత్నించే నలుగురు స్నేహితుల చుట్టూ ఈ కథ తిరుగుతుంటుంది. డిసెంబర్ 21న ఇది ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. తాజాగా విడుదలైన ట్రైలర్ అంచనాలను రెట్టింపు చేసింది.
Actor Shah Rukh Khan visited Mata Vaishno Devi shrine earlier today ahead of the release of his new film #Dunki #SRK𓃵 #ShahRukhKhan𓀠 pic.twitter.com/rYcLYRfMjG
— Pooja Mehta (@pooja_news) December 12, 2023
👉 – Please join our whatsapp channel here –