DailyDose

12 నుంచి సంక్రాంతి ప్రత్యేక రైళ్లు

12 నుంచి సంక్రాంతి ప్రత్యేక రైళ్లు

సంక్రాంతి పండుగ నేపథ్యంలో ప్రయాణికుల అవసరాలను దృష్టిలో పెట్టుకుని పలు రైల్వే స్టేషన్ల మధ్య ఆరు ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేస్తూ శుక్రవారం రైల్వే అధికారులు నిర్ణయం తీసుకున్నారు. ఈ నెల 12 నుంచి 20వ తేదీ వరకు టైమ్‌టేబుల్‌ వారీగా రైళ్లు నడుస్తాయన్నారు. సికింద్రాబాద్‌- బరంపురం, హైదరాబాద్‌- బరంపురం స్టేషన్ల మధ్య ప్రత్యేక రైళ్లు నడుస్తాయని అధికారులు తెలిపారు.

మరో రెండు ప్రత్యేక రైళ్లు..
అదేవిధంగా.. నర్సాపూర్‌- సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్ల మధ్య, ఈ నెల 10, 11 తేదీల్లో ఈ రెండు రైళ్లు నడుస్తాయని అధికారులు పేర్కొన్నారు.

విద్యుద్ధీకరణ పనులు పూర్తి..
దక్షిణ మధ్య రైల్వే జోన్‌ ఆధ్వర్యంలో గిద్దలూరు- జగ్గంబొట్ల కృష్ణాపురం రైల్వే స్టేషన్ల మధ్య విద్యుద్ధీకరణతో పాటు రెండో రైల్వే లైన్‌ పనులు పూర్తి కావడంతో వాటిని శుక్రవారం ప్రారంభించినట్లు రైల్వే అధికారులు తెలిపారు. గుంటూరు- గుంతకల్‌ డబ్లింగ్‌, విద్యుద్ధీకరణ ప్రాజెక్టులో భాగంగా ఈ పనులు పూర్తయినట్లు అధికారులు పేర్కొన్నారు. ఈ రెండు స్టేషన్ల మధ్య 26.4 కిలోమీటర్ల మేరకు ప్రాజెక్టు పనులు పూర్తయ్యాయని, ఈ ప్రాజెక్టు 2016- 17లో రూ.3,887 కోట్ల అంచనా వ్యయంతో 401 కిలోమీటర్ల దూరం కోసం నిధులు మంజూరయ్యాయన్నారు.

👉 – Please join our whatsapp channel here –

https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z