సురేష్ ప్రొడక్షన్స్. తెలుగు సినిమా ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేని నిర్మాణ సంస్థ. ఈ బ్యానర్పై దేశంలోని అన్ని భాషల్లో విజయవంతమైన చిత్రాలను నిర్మించి మూవీ మొఘల్గా పేరుగాంచారు డి.రామానాయుడు. ఆయన తర్వాత డి.సురేష్బాబు ఈ బ్యానర్పై సినిమాలు నిర్మిస్తున్నారు. భారీ బడ్జెట్ చిత్రాలతో పాటు, కథాబలమున్న చిన్న చిత్రాలను నిర్మిస్తూ, నూతన దర్శకులను ప్రోత్సహిస్తున్నారు. సినిమా నిర్మాణంపై రామానాయుడికి ఉన్న ప్యాషన్ను సురేష్బాబు కొనసాగిస్తున్నారు. కాగా, సినిమా ప్రారంభంలో కనిపించే సురేష్ ప్రొడక్షన్స్ లోగోకు ఒక కథ ఉంది. అందులో కనిపించే ఇద్దరు చిన్నారులు వేరెవరో కాదు. ఒకరు సురేష్బాబు కాగా, మరొకరు అగ్ర కథానాయకుడు వెంకటేష్. ఈ లోగో వెనుక కథను సురేష్బాబు ఓ సందర్భంలో పంచుకున్నారు.
ఆ లోగొ మీద ఉన్నది రామనాయుడు బిడ్డలే!
Related tags :