Food

కాఫీ డే అసలు కథ ఇది

The story of how cafe coffee day self-ruined itself with illegal assets and income tax dept - కాఫీ డే అసలు కథ ఇది

కాఫీ ప్రపంచంలో ఆయనో బ్రాండ్. కొద్దికాలంలోనే కాఫీ విజయాన్ని రుచిచూసిన బిజినెస్మెన్. ఆయనే కెఫే కాఫీ డే సిద్ధార్థ. ఆ పేరే ఒక మహత్తు… కాఫీ తాగినంత మత్తు. పుట్టుకతోనే శ్రీమంతుడైనా జీవితాన్ని సవాలుగా తీసుకున్నాడు. సంచలన విజయం సాధించాడు.
*కర్ణాటకలోని చిక్‌మగుళూరు జిల్లాలోని ఓ కాఫీ సాగు కుటుంబంలో పుట్టారు సిద్ధార్థ. ఈ కుటుంబం గత 140 ఏళ్లుగా కాఫీ పంటలు పండిస్తోంది. కష్టాలనేవి తెలీకుండా పెరిగాడు. అయితే లోక జ్ఞానం తెలుసుకునేందుకు బోర్డింగ్‌ స్కూల్‌లో చేర్పించారు తల్లిదండ్రులు. చిన్నప్పుడు ఆటల మీదున్న శ్రద్ధ చదువు మీద ఉండేది కాదు. ఎనిమిదో తరగతిలో అత్తెసరు మార్కులొచ్చాయి. అతడి ప్రవర్తనను భరించలేని టీచర్‌ “ఒరే, నీకు అర్థమయ్యేలా పాఠాలు చెప్పలేకపోతున్నానన్న సందేహం కలుగుతోంది. చదువుపై కాస్త శ్రద్ధ పెడితే నీ భవిష్యత్తుకే మంచిది” అంటూ కంటతడి పెట్టింది. టీచర్‌ కన్నీళ్లు చూశాక కళ్లు తెరిచాడు సిద్ధార్థ.
*దేశాన్ని కంటికి రెప్పలా కాపాడే సైనికులంటే సిద్ధార్థకు గౌరవం. గ్రాడ్యుయేషన్‌ పూర్తి చేశాక సైన్యంలోకి వెళదామని డిఫెన్స్‌ అకాడమీ పరీక్ష రాశారు. ఉత్తీర్ణుడు కాలేదు. చేసేది లేక మంగళూరుకు వెళ్లి అర్థశాస్త్రంలో పోస్టు గ్రాడ్యుయేషన్‌ చేశారు. ఒక రోజు స్టాక్‌మార్కెట్‌పై శిక్షణ కోసం బొంబాయి వెళ్లాలనుకుంటున్నా అంటూ తల్లిదండ్రులతో చెప్పారు. దీంతో కాఫీ తోటలు చూసుకుంటాడనుకున్న కొడుకు ఇలా మాట్లాడటం ఆశ్చర్యం కలిగించింది. ఎంత చెప్పినా వినలేదు. ఆఖరికి తండ్రి సిద్ధార్థ చేతిలో కొంత డబ్బు పెట్టి సాగనంపారు.
*డిఫెన్స్‌కు వెళదామని..
దేశాన్ని కంటికి రెప్పలా కాపాడే సైనికులంటే సిద్ధార్థకు గౌరవం. గ్రాడ్యుయేషన్‌ పూర్తి చేశాక సైన్యంలోకి వెళదామని డిఫెన్స్‌ అకాడమీ పరీక్ష రాశారు. ఉత్తీర్ణుడు కాలేదు. చేసేది లేక మంగళూరుకు వెళ్లి అర్థశాస్త్రంలో పోస్టు గ్రాడ్యుయేషన్‌ చేశారు. ఒక రోజు స్టాక్‌మార్కెట్‌పై శిక్షణ కోసం బొంబాయి వెళ్లాలనుకుంటున్నా అంటూ తల్లిదండ్రులతో చెప్పారు. దీంతో కాఫీ తోటలు చూసుకుంటాడనుకున్న కొడుకు ఇలా మాట్లాడటం ఆశ్చర్యం కలిగించింది. ఎంత చెప్పినా వినలేదు. ఆఖరికి తండ్రి సిద్ధార్థ చేతిలో కొంత డబ్బు పెట్టి సాగనంపారు.
*బొంబాయికి పయనం
చిక్‌మగళూర్‌ నుంచి బొంబాయి చేరుకున్న సిద్ధార్థ్‌.. ఒక ఆఫీసుకి వెళ్లి రిసెప్షనిస్టుతో మహేష్‌ కంపానీ గారిని కలవాలని అనడిగారు. ‘‘ఆయన్ని కలవడానికి కొన్ని రోజుల నుంచి ఎదురుచూసేవాళ్లు చాలామందే ఉన్నారు. నువ్విప్పుడొచ్చి కలుస్తానంటే కుదరదు” అంది రిసెప్షనిస్టు. పదే పదే బతిమాలితే ఆయన గదిలోకి వెళ్లేందుకు అనుమతి లభించింది. ఆయన్ను కలిసి ‘‘మీ దగ్గరే శిష్యరికం చేయాలి. లేదంటే మా ఊరెళ్లి, నాకిష్టం లేకపోయినా కాఫీ తోటలు సాగు చేయక తప్పదు. ఒక్క అవకాశం ఇవ్వండి” అంటూ వినయంగా వేడుకున్నారు. సిద్ధార్థ అంకితభావాన్ని చూసి చిరునవ్వుతో ఓకే అన్నారు మహేష్‌ కంపాని. బొంబాయి స్టాక్‌ ఎక్స్ఛేంజ్‌కి ప్రెసిడెంట్‌, జేఎం క్యాపిటల్‌ అధినేతయిన ఆయన దగ్గర ఎంతైనా నేర్చుకోవచ్చన్నది సిద్ధూ ఆలోచన. అలా ఆయన దగ్గర స్టాక్‌మార్కెట్‌లో పాఠాలు, ట్రేడింగ్‌ మెలకువలు ఆపోసన పట్టాడు.
*మళ్లీ సొంతూరుకు..స్టాక్‌ మార్కెట్‌ గురించి కొంత అవగాహన వచ్చాక తిరిగి సొంతూరు చేరుకున్నారు సిద్ధార్థ్‌. తాను బెంగళూరులో స్టాక్‌ బ్రోకర్‌ బిజినెస్‌ చేద్దామనుకుంటున్నానని, డబ్బు కావాలని తల్లిదండ్రులను అడిగారు సిద్ధార్థ. తల్లిదండ్రులు ఆయన తపనను గమనించి రూ.ఏడున్నర లక్షలు చేతికిచ్చారు. ఒకవేళ వ్యాపారంలో నష్టపోతే, తిరిగొచ్చి కాఫీ తోటలు చూసుకోవాలని ఓ షరతు కూడా విధించారు. ఆ డబ్బుతో శివన్‌ సెక్యూరిటీస్‌ అనే స్టాక్‌ బ్రోకింగ్‌ కంపెనీని ప్రారంభించారు. బొంబాయిలో సంపాదించిన పరిజ్ఞానం ఇక్కడ పనికొచ్చింది. వచ్చిన లాభాలతో చిక్‌మగుళూరులో కాఫీ తోటలు కొనేవారు. కొన్నాళ్లకు శివన్‌ సెక్యూరిటీస్‌ ‘వే 2 వెల్త్‌’గా మారింది. తొలుత కాఫీ ఎగుమతి నుంచి.. 1984లో శివన్‌ సెక్యూరిటీస్‌ అనే సంస్థను కొనుగోలు చేసిన సిద్ధార్థ.. అనతి కాలంలోనే దాన్ని విజయవంతమైన పెట్టుబడి బ్యాంకింగ్‌గా తీర్చిదిద్దారు. అయితే సిద్ధార్థ కుటుంబానికి 12వేల ఎకరాలకు పైగా కాఫీ తోటలు ఉన్నాయి. ఆ కాఫీ గింజలను ఎవరికో అమ్మే బదులు తానే రిటైల్‌ మార్కెట్లోకి ఎందుకు రాకూడదని అనుకున్నారు. ఆ ఆలోచన నుంచి పుట్టిందే అమాల్గమేటెడ్‌ బీన్‌ కాఫీ ట్రేడింగ్‌ కంపెనీ. 1992లో ప్రారంభించిన ఈ సంస్థ.. కాఫీ గింజలను విదేశాలకు ఎగుమతి చేస్తుంది. రెండేళ్లలోనే దేశంలోనే అతిపెద్ద కాఫీ ఎగుమతిదారుగా ఈ కంపెనీ ఎదిగింది.
*కాఫీ డే’ మొదలైందిలా..1996లో బెంగళూరులోని అత్యంత రద్దీ అయిన బ్రిగేడ్‌ రోడ్‌లో ‘కేఫ్‌ కాఫీ డే’ పేరుతో తొలి రిటైల్‌ అవుట్‌లెట్‌ను ప్రారంభించారు సిద్ధార్థ. అప్పట్లోనే ఇక్కడ ఒక కాఫీ, గంట ఇంటర్నెట్‌కు రూ.100 ఛార్జ్‌ చేసేవారు. ఈ అవుట్‌లెట్‌ విశేషాదరణ పొందింది. దీంతో ఇతర ప్రాంతాలకూ దీన్ని విస్తరించారు. దేశంలోనే అతిపెద్ద కాఫీ చైన్‌.. ప్రస్తుతం భారత్‌లో కేఫ్‌ కాఫీ డే పేరు తెలియని వారుండరంటే అతిశయోక్తి కాదు. అన్ని ప్రధాన నగరాల్లో ఈ కంపెనీ అవుట్‌లెట్లు ఉన్నాయి. దేశవ్యాప్తంగా 1700 కెఫేలు, 48,000 వెండింగ్‌ మిషన్లు ఉన్నాయి. వియన్నా, చెక్‌ రిపబ్లిక్‌, మలేషియా, నేపాల్‌, ఈజిప్టు లాంటి దేశాల్లోనూ కాఫీడే శాఖలు ఉన్నాయి. అలా తక్కువ కాలంలోనే కాఫీ డేకు మంచి గుర్తింపు లభించింది. కాఫీ కింగ్‌గా సిద్ధార్థ్‌ పేరు మార్మోగింది. కాఫీడేతో పాటు హాస్పిటాలిటీ వ్యాపారాన్ని కూడా ప్రారంభించారు. కెరీర్‌ సక్సెస్‌ఫుల్‌గా ఉన్న సమయంలోనే సిద్ధార్థ ప్రముఖ ఐటీ సంస్థ మైండ్‌ ట్రీలో పెట్టుబడులు పెట్టారు. 1999లో రూ.340 కోట్లతో వాటాలు కొనుగోలు చేశారు. ఈ ఏడాదే మైండ్‌ట్రీలో వాటాలను రూ.3వేల కోట్లకు అమ్మేశారు.
*మాజీ సీఎంకు అల్లుడు..కర్ణాటక మాజీ సీఎం ఎస్‌.ఎం కృష్ణ కుమార్తె మాళవిక కృష్ణను సిద్ధార్థ వివాహం చేసుకున్నారు. వీరికి ఇద్దరు పిల్లలు. మాళవిక.. సిద్ధార్థ కంపెనీ వ్యవహారాల్లో చురుగ్గా ఉంటారు. 2008 నుంచి సిద్ధార్థకు చెందిన హాస్పిటాలిటీ బిజినెస్‌ పూర్తి బాధ్యతలు ఈమే నిర్వర్తిస్తున్నారు. కాఫీడే బోర్డ్‌ ఆఫ్ డైరెక్టర్‌్్లోనూ ఆమె ఒక సభ్యురాలు. ఇలా కెరీర్‌ హాయిగా సాగిపోతున్న సమయంలో సిద్ధార్థ పన్ను ఎగవేత రూపంలో వివాదాల్లో చిక్కుకున్నారు. కోట్ల రూపాయల పన్ను ఎగవేసినట్లు ఆరోపణలు రావడంతో 2017లో ఆయన కంపెనీలపై ఆదాయపు పన్ను శాఖ సోదాలు చేపట్టింది. ముంబయి, బెంగళూరు, చెన్నై, చిక్‌మగుళూరులోని కాఫీ డే దుకాణాలు, ఎస్టేట్‌లపై అధికారులు దాడులు నిర్వహించారు. రూ. 650కోట్ల విలువైన అక్రమాస్తులను గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. దీంతో ఆయనకు ఆర్థిక ఇబ్బందులు మొదలయ్యాయి. మరోవైపు కేఫ్‌ కాఫీ డే గత కొంతకాలంగా నష్టాల్లో సాగుతున్నట్లు తెలుస్తోంది. దీంతో కంపెనీలో కొంత వాటాను కోకాకోలాకు విక్రయించాలని సిద్ధార్థ అనుకున్నారు.