Politics

బాబు…ఇసుక దోపీడిపై చర్చిద్దాం రండి

Minister Avanthi Srinivas Calls Chandrababu For Discussion On Sand Mafia

రాష్ట్రంలో ఇసుక దోపిడీ జరుగుతుందంటున్న చంద్రబాబు ఈ అంశంపై చర్చకు రావాలని ఏపీ మంత్రి అవంతి శ్రీనివాసరావు సవాల్‌ విసిరారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. డీజీపీ, పోలీసులను బెదిరించేలా తెదేపా అధినేత చంద్రబాబు మాట్లాడారని ఆరోపించారు. విశాఖ తెదేపా కార్యాలయంలో ఫ్యూజు పోయి కరెంటు పోతే ..దానిపైనా సీఎం జగన్‌ను విమర్శించటం సరికాదన్నారు. మంచి విమర్శలు చేస్తే తమ లోపాలను సరిదిద్దుకుంటామని చెప్పారు. గతంలో జగన్‌మోహన్‌రెడ్డిని ఎయిర్‌పోర్టు నుంచి బయటకు కూడా రానివ్వలేదని అవంతి గుర్తు చేశారు.