WorldWonders

అన్నవరం ఆలయంలో మైనర్ల పెళ్లి

Two MInors Gets Married In Annavaram Temple

పత్తిపాడు నియోజవర్గం శంఖవరం మండలం అన్నవరం గ్రామం శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి వారి దేవస్థానం అధికారులు చోద్యంతో ఓ మైనర్ల జంట పెళ్లి చేసుకున్నారు.

సోమవారం మధ్యాహ్నం మూడు గంటల ప్రాంతంలో రత్నగిరి కొండ దిగువన ఆధ్వర్యంలో ఉన్న కనకదుర్గ ఆలయంలో రాజమండ్రికి చెందిన మైనర్లు వెంకట్ పద్మజ లు పెద్దల అంగీకారం లేకుండా స్వతంత్రంగా పెళ్లి చేసుకోవడం చర్చనీయాంశమైంది.

మైనర్ల తాళితంతు జరుగుతున్నా అక్కడ అర్చకులుగాని, సెక్యూరిటీ, అధికారులు అభ్యంతరం చెప్పకపోవడాన్ని భక్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు.

పెళ్లి తంతు మమా అనిపించిన తర్వాత నిర్భయంగా రత్నగిరికి వచ్చి స్వామి వారిని సందర్శించిన సందర్భంలో క్యూలైన్లలో రాకుండా వి.ఐ.పిలు వచ్చినట్లు లోనికి వచ్చినా ఏ ఒక్క అధికారులు గాని, సెక్యూరిటీ సిబ్బంది, పోలీసులు గాని అభ్యంతరం చెప్పకపోవడం విశేషం.

ఈ జంట ఆలయంలోకి వచ్చిన తీరు నిశితంగా గమనిస్తే సెక్యూరిటీ డొల్లతనం బయటపడింది.