ScienceAndTech

ప్రముఖ గణిత శాస్త్రవేత ఐజాక్ న్యూటన్ చివరి రోజులు ఇలా గడిచాయి.

The last phase of Sir Isaac Newton's Life

నేడు విద్యార్ధులు నేర్చుకుంటున్న పలు మాధమేటిక్ , ఫిజిక్స్ విభాగాలకు ఆద్యుడు న్యూటన్. ఆప్లిక్స్ కాలుక్యులస్ ఆయన సృష్టించినవే ఖగోళ లెక్కలు ఆయన కట్టినవే. ఆకాలంలో సాటి పరిశోధకులతో ఫలితాల విషయంలో పోటీపడడటమే కాదు, పోరాటాలు చేశాడు న్యూటన్. న్యూటన్ పేరు తెలియకుండా పాటశాల విద్య ముగియదు. ప్రపంచంలోని ఏ దేశ విద్యాదికైనా సూర్యకాంతిలో ఏడు రంగులున్నాయన్న న్యూటన్ సూత్రం ఆకాశంలో ఇంద్రధనుస్సు చూసినపుడల్లా గుర్తుకు వచ్చి తీరుతుంది. న్యూటన్ ఒక అపూర్వ మేధావి. మాధమేటిక్స్ ఫిజిక్స్, ఖగోళ శాస్త్రం, మత శాస్త్రాలన్నింటిని అధ్యయనం చేసిన వాడు. 17వ శతాబ్దపు విజ్ఞాన విప్లవంలో కీలక పాత్ర సర్ ఐజాక్ న్యూటన్ ది. బాల్యంలో తండ్రిని కోల్పోయాడు తల్లి న్యూటన్ ని అమ్మమ్మ దగ్గరవదిలి మరి వివాహం చేసుకుని వెళ్లి పోయింది. పాతికేళ్ళు వచ్చేసరికి సైన్స్ లో పోస్ట్ గ్రాడ్యుయేట్ అయ్యాడు. అక్కడ నుండి పరిశోధనలే అతని జీవితం. నేడు విద్యార్ధులు నేర్చుకుంటున్న పలు కాలుక్యులస్ ఆయన సృష్టించినవే. ఖగోళ లెక్కలు ఆయన కట్టినవే. ఆకాలంలో సాటి పరిశోధకులతో ఫలితాల విషయంలో పోటీ పడటమే కాదు, పోరాటాలు చేశాడు న్యూటన్.

*అలెక్క మీద బాగా దృష్టి పెట్టాడు. బైబిల్ కాలం మీద అంచనాలు వేశాడు. మతం అతన్ని ఇబ్బంది పెట్టింది. మతపెద్దలు అతన్ని అనుమానంగా చోసేవారు. అదొక తీవ్రమైన ఒత్తిడి. ఆ ఒత్తిడి ఫలితంగా న్యూటన్ నర్వస్ బ్రేక్ డౌన్ లక్షణాలు మొదలయ్యాయి 1695నాటికి. న్యూటన్ ఆలోచనలు పర్తిశోధనలు అతని మెదడు మీద ప్రభావం చూపించాయి. మెదడు అలసటకు గురైంది. మరోవైపు తానూ చేస్తున్న పరిశోధనలు కనుక్కుంటున్న కొత్త విషయాలు అతను చదువుతున్న మత గ్రంధాలలో చెప్పబడిన అంశాల కన్నా వైరుద్యం అతన్ని వేధించసాగింది. మత గ్రంధాలలో వాస్తవాలు తక్కువ, ప్రజలను విశ్వాసంతో కట్టిపడేసే అంశాలు ఎక్కువగా ఉన్నాయన్నది న్యూటన్ అభిప్రాయం ఆరోజుల్లో మతాన్ని దిక్కరించలేని పరిస్థితి పాలకులు మతపెద్దలు చెప్పినట్టే నడుచుకునేవారు. చర్చి పెత్తనం ప్రశ్నించడానికి వీలులేదు. అందుకే తానూ కనుక్కున్నా విషయాలు మత గ్రంధంలోని లోపాలను రహస్యంగా నమోదు చేసినా వాటిని ప్రచురించే ధైర్యం చెయ్యలేకపోయాడు. ఎవరిదో సిపార్సు తో లండన్ లోని ప్రభుత్వ నాణాలు ముద్రించే మింట్ వార్డెన్ ఉద్యోగం తీసుకుని లోందన్ కి 1696లో మకాం మార్చాడు. న్యూటన్ నిజానికి ఆపదవి ఒక గౌరవప్రదమైనది. కింది వ్యవహారాలూ చూసే సిబ్బంది ఉంటారు. కాని న్యూటన్ అలాకాదు మింట్ వ్యవహారం మొత్తం అధ్యయనం చేశాడు. మొత్తం మీద దేశంలో చలామణిలో ఉన్న ఇరవై శాతం నాణాలు దొంగ నాణాలు అని తేల్చాడు. దొంగ నాణేలు తయారీకి నాటి చట్టం ప్రకారం ఉరిశిక్ష విధించేవారు. ఆదొంగ నాణాలు పట్టుకునేందుకు దొంగ నాణేలు సులభంగా తయారు చేసేందుకు వీలు కాని పద్దతిలో కొత్త నాణేలు తయారు చేసేసాడు న్యూటన్. ఐనా దొంగ నాణాల తాయారు చేశాడు న్యూటన్. ఇంకా దొంగ నేరస్తులను తప్పించే వ్యవస్థ మింట్ లోనే ఉందని న్యూటన్ కి అర్ధమైంది. అందుకే ఆయనే స్వయంగా రంగంలోకి దిగాడు. న్యూటన్ మెదడు మహాచురుకైనది మారు వేషాలు వేసుకుని దొంగ నాణాల ముటాలోకి వెళ్ళిపోయి వారిని పట్టుకునేవాడు. రహస్యంగా సమాచారం సేకరించారు.

వారందరి మీద కేసులు పెట్టించాడు. అయితే మింట్ వ్యవస్థలో పాతుకుపోయిన అవినీతి ఆ కేసులను నీరుకరుస్తున్నాయని తానె స్వయంగా కేసులను వాదించాడు. సాక్ష్యాలను కోర్టు ముందుంచాడు. న్యూటన్ దెబ్బకు దొంగ నాణాల ముటాలు వణికిపోయాయి. ఒక్క సంవత్సరంలో 28మంది నేరాలను రుజువు చేయటమే కాక వారికి ఉరిశిక్ష విధించేలా చేశాడు. ఆ వురిశిక్షలకు అమలులో కూడా అవినీతి ఉంటుందేమోనని తానె స్వయంగా దగ్గరుండి వురి తీయించాడు. మనిషి ప్రాణం పోతుంటే న్యూటన్ నవ్వుతుండే వాడని నాటి జైలు సిబ్బంది అన్నారు. కానీ తాను సమాజానికి చెరుపు చేసే నేరస్తుడిని అంతం చేస్తున్నా అనేవాడు న్యూటన్. న్యూటన్ అందించిన మింట్ సేవలకు బ్రిటీష్ సత్కరించింది. బ్రిటన్ నాటి వరకు అనుసరిస్తున్న సిల్వర్ సౌండర్స్ విధానం నుండి గోల్డ్ స్టాండర్స్ విధానానికి మారటానికి మూలం న్యూటన్ 1717లో సమర్పించిన నివేదికే. దేశానికి డబ్బు విషయంలో ఎన్నో జాగ్రత్తలు నేర్పిన న్యూటన్ తానూ పెట్టిన పెట్టుబడులను నస్తాపోవటానికి చిత్రం. తన ఆదాయాన్ని న్యూటన్ సౌత్ సి కంపెనీలో పెతుబడి పెట్టాడు. ఆ కంపెనీ ఆఫ్రికా ఖండంలోని ప్రజల్ని పట్టుకుని బానిసలుగా మార్చి అమెరికా వంటి దేశాలకు ఎగుమతి చేసేది. మానవత్వంలేని ఆ సంస్థలో పెట్టుబడులు పెట్టటాన్ని బట్టి న్యూటన్ మనసత్వం అర్ధం చేసుకోవచ్చనే వారు. ఏమైనా ఆసంస్థ 1720లో దివాలా తీసింది ఆకాలం లోనే ఇరవై వేల పౌండ్ల నష్టపోయాడు న్యూటన్.

*న్యూటన్ బ్రహ్మచారి ప్రేమ వ్యవహారాలు ఏవీ సఫలం కాలేదు. చివరిదశలో తనను చూసుకునే కుటుంబంలో మేకోదలుని ఎంచుకున్నాడు. మింట్ ఉద్యోగం చేస్తున్నాడు. రాయల్ ఎకాడమీ వ్యవహారాలు చూస్తున్నాడు.

*అయితే లండన్ నుంచి కాక సమీపంలో క్రాంబారీ పార్క్ నుంచి విధులు నిర్వహించేవాడు. లండన్ లో ఇల్లు ఉంది. అన్నింటి వ్యవహారాలూ ఆ మేనకోడలు ఆమె భర్త చూసుకునే వారు. అయితే లండన్ నుంచి కాక సమీపంలో క్రాన్ బారీ పార్క్ నుంచి విధులు నిర్వహించేవాడు. లండన్ లో ఇల్లు ఉంది. అన్నింటి వ్యవహారాలూ ఆ మేనకోడలు ఆమె భర్త చూసుకునే వారు. అయితే లండన్ నుంచి కాక సమీపంలో క్రాన్ బారీ పార్క్ నుంచి విధులు నిర్వహించేవాడు. లండన్ లో ఇల్లు ఉంది. అన్నింటి వ్యవహారాలు ఆ మేనకోడలు ఆమె భర్త చూసుకునే వారు. ఎవరితోనూ ఆత్మీయంగా వ్యవహరించే గుణం న్యూటన్ లో లేదు. తానూ తన సైంటిఫిక్ లోకంలోనే విహరించేవాడు. పరిశోధనల విషయంలోనూ వివాదాలు సృస్టించుకునేవాడు. చిన్న తేడావస్తే సంబంధం తెన్చుకునేందుకు వెనుకడేవాడు కాదు. మానవులలో ఉండే సహజ బలహీనతలే న్యూటన్ లోనూ ఉన్నాయి. అన్నది ఒల్టర్ చేసిన వ్యాఖ్య. తనలోకంలో తానుగా జీవించిన న్యూటన్ 1727 మర్చి 20న నిద్రలోనే మరణించాడు ఎవరిని ఎటువంటి ఇబ్బందికి గురి చేయక వేల్లిపోవాలనుకున్న తన ఆలోచన నిజమైంది.