ప్రతిపక్షాల విమర్శలు, ప్రజల ప్రశ్నలు, సామాజిక మాధ్యమాల్లో జరిగే ట్రోల్స్పై కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ తనదైన శైలిలో స్పందిస్తుంటారు. తన ప్రసంగాలు, విమర్శలు, ప్రశంసలతో అందరినీ ఆకట్టుకుంటుంటారు. భారత స్త్రీలు పాటించే ఓ ఆచారంపై గతంలో ఆమె ఇచ్చిన వివరణ ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతోంది. ఇంతకీ ఆ సంప్రదాయం ఏంటీ.. ఆమె ఇచ్చిన వివరణ ఏంటో తెలుసా..?సాధారణంగా సంప్రదాయ భారత కుటుంబాల్లో భర్త ముందు నడుస్తూ ఉంటే భార్య ఆయన్ని అనుసరిస్తుంటుంది. దీనికి శాస్ర్తపరమైన కారణం ఏదైనా.. స్మృతి ఇరానీ ఇచ్చిన వివరణ మాత్రం అందరినీ ఆకట్టుకుంటోంది. ఆ వివరణ ఆమె మాటల్లోనే..‘‘భారత సంప్రదాయం ప్రకారం.. స్త్రీ ఎప్పుడూ తన భర్త కంటే రెండడగులు వెనకాలే నడవాలని దేవుడు నిశ్చయించాడు. ఎందుకంటే ఒకవేళ భర్త దారితప్పినా.. లేదా సమతుల్యత కోల్పోయినా.. తిరిగి సరైన మార్గంలో నడిపే శక్తి మహిళకే ఉంది. అందుకే భార్య ఎప్పుడూ భర్త వెనకాలే ఉండాలి’’ అని అన్నారు. ఓ సమావేశంలో స్మృతి ఈ వ్యాఖ్యలు చేయగా.. దీనికి సంబంధించిన వీడియోను గతంలో ఒకరు టిక్టాక్లో పోస్ట్ చేశారు. తాజాగా దీన్ని ఓ నెటిజన్ ట్విటర్ ద్వారా పంచుకున్నారు. దీంతో ఈ వీడియో ఇప్పుడు వైరల్గా మారింది.
మహిళలకే ఆ శక్తి ఉంది
Related tags :