Politics

చంద్రబాబు నన్ను నిట్టనిలువునా ముంచారు

Kadiri Baburao Joins YSRCP-Slams Chandrababu

తెదేపా మాజీ ఎమ్మెల్యే కదిరి బాబూరావు వైకాపాలో చేరారు. తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో సీఎం జగన్‌ సమక్షంలో ఆయన వైకాపా తీర్థం పుచ్చుకున్నారు. జగన్‌ ఆయనకు వైకాపా కండువా వేసి పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం బాబూరావు మీడియాతో మాట్లాడుతూ తెదేపా అధినేత చంద్రబాబుపై విమర్శలు చేశారు. చంద్రబాబు తనను నిట్టనిలువునా మోసం చేశారని ఆరోపించారు. ఆయన్ను విశ్వసించలేకే పార్టీ నుంచి బయటకు వచ్చినట్లు చెప్పారు. గతంలోనూ తనకు పార్టీ మారే అవకాశం వచ్చిందన్నారు. హిందూపురం ఎమ్మెల్యే, సినీనటుడు నందమూరి బాలకృష్ణ తనకు మిత్రుడు కాబట్టే ఇన్నాళ్లూ తెదేపాలో కొనసాగానని చెప్పారు.