Politics

5కోట్ల నుండి ముగ్గురికి పడిపోయారు

Vijaysai Reddy Tweets On Chandrababu's 40Years Experience

టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు పై వైఎస్సార్‌సీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి మరోసారి ఫైర్‌ అయ్యారు. ఆంధ్రలో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితుల దృష్ట్యా ఐదు కోట్ల ప్రజల తరపున మాట్లాడాల్సిన చంద్రబాబు కేవలం ముగ్గురి ఉద్యోగాల కోసం పాటుపడుతున్నారంటూ దుయ‍్యబట్టారు. కాగా తన ట్వీట్‌లో ‘ప్రతిపక్ష నేతగా ఐదు కోట్ల ప్రజానీకం తరపున మాట్లాడాల్సిన వ్యక్తి భ్రమరావతి కోసం మూడు గ్రామాలకు పరిమితమయ్యాడు. ఇప్పుడు ముగ్గురి ఉద్యోగాల కోసం అలుపెరగని పోరాటం చేస్తున్నాడు. 40 ఇయర్స్ ఇండస్ట్రీ తన పరిధిని తనే కుదించుకుంటూ పోతున్నాడు. వాటే గ్రేట్ ఫాల్!’ అంటూ విమర్శనాస్త్రాలు సంధించారు.