Kids

భూతవైద్యుడు చెప్పాడని…పసిపాపను చంపుకున్నారు

Vizag Tribals Kill Four Month Baby Over Blind Faith

విశాఖ మన్యంలో కొందరు గిరిజనులు మూఢ నమ్మకాలను ఇంకా వీడటం లేదు. భూత వైద్యుడు చెప్పిన మాట విని.. నాలుగు నెలల పసిపాపకు తల్లి పాలు పట్టక గుక్కపట్టి ఏడ్చేలా చేసి చివరకు ఊపిరి పోయేందుకు కారణమయ్యారు. ఈ విషాదం విశాఖ జిల్లా జి.మాడుగుల మండలం కోరాపల్లి పంచాయతీ జాగేరు గ్రామంలో ఆలస్యంగా వెలుగుచూసింది. గ్రామానికి చెందిన ఓ మహిళకు రెండో కాన్పులో అమ్మాయి పుట్టింది. 4 నెలల తర్వాత చిన్నారి తల్లిదండ్రులు భూతవైద్యుణ్ని సంప్రదించారు. చిన్నారికి దోషం ఉందని, తల్లి మరణించే అవకాశాలున్నాయని, దోష నివారణగా పాపకు పాలు పట్టవద్దని అతడు సూచించాడు. ఆ మరుసటి రోజు నుంచి బిడ్డకు పాలు పట్టడం మానేశారు. సమీప బంధువు ఒకరు ఏడో రోజు ఇంటికి వచ్చి పాప పరిస్థితిని చూసి చలించి పాపను తీసుకెళ్లి మరో బాలింత వద్ద పాలు పట్టించేందుకు ప్రయత్నించారు. ఆ తల్లి దగ్గర పాలు తాగుతూనే చిన్నారి మృత్యుఒడికి చేరింది.