Sports

బెంబేలెత్తిన బెంగుళూరు SAI

Bangalore SAI Closed Due To Corona

బెంగళూరు స్పోర్ట్స్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా (SAI)లో పనిచేసే ఒక సీనియర్‌ వంట మనిషి కరోనాతో మృతిచెందటంతో సాయ్‌ శిక్షణా సంస్థ మూతపడింది. వివరాల్లోకి వెళితే… లాక్‌డౌన్‌ సడలింపుల్లో భాగంగా గత శుక్రవారం సాయ్‌లోని వంటశాలను తెరిచేందుకు అధికారులు సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి వంటమనిషితోపాటు సుమారు 25 నుంచి 30 మంది అధికారులు హాజరైనట్లు సమాచారం. సమావేశానికి హాజరైనప్పుడు సదరు వంటమనిషి పూర్తి ఆరోగ్యంతో ఉన్నాడని సంబంధిత అధికారులు తెలిపారు. అనంతరం సోమవారం సదరు వ్యక్తి అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరాడని… ఆ మరుసటిరోజే గుండెనొప్పితో మృతి చెందినట్లు వారు పేర్కొన్నారు. అయితే, మృతదేహానికి నిర్వహించిన వైద్య పరీక్షల్లో కొవిడ్‌ పాజిటివ్‌ నిర్ధారణ అయిందని అధికారులు తెలిపారు. ఈ సమావేశం అనంతరం భారతీయ మహళా హాకీ జట్టు కూడా అదే హాలులో సమావేశమయ్యింది. కాగా, సమావేశానికి హాజరైన అధికారులు, ఇతర సిబ్బందిని క్వారంటైన్‌కు పంపించారు.