NRI-NRT

తెరాస మలేషియా ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ సంబరాలు

NRI TRS Malaysia Celebrates Telangana Formation Day

కోవిడ్ -19 కారణంగా లాక్ డౌన్ నేపథ్యంలో ఈ సంవత్సరం తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలను తెరాస మలేషియా కమిటీ సభ్యులు మరియు మలేషియా లో ఉంటున్న ప్రవాస తెలంగాణ ప్రజలు ఆన్లైన్లో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జరుపుకున్నారు.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తెరాస ఎన్నారై సమన్వయకర్త శ్రీ మహేష్ బిగాల గారు మరియు గౌరవ అతిథిగా తెలంగాణ జానపద గాయని రేలారే గంగ గారు సభ్యులతో కలిసి కాన్ఫరెన్స్ కాల్ లో రాష్ట్ర అవతరణ వేడుకలలో పాల్గొన్నారు.

అధ్యక్షులు చిట్టిబాబు గారు తెలంగాణ తల్లి పటానికి పుష్పాలంకరణ చేసి జ్యోతిప్రజ్వళనతో కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్బంగా సభ్యులందరు అమరవీరుల త్యాగాన్ని గుర్తుచేసుకొని వారికి నివాళులర్పించి 2 నిముషాలు మౌనం పాటించారు.

ముఖ్యఅతిథి మహేష్ బిగాల గారు మాట్లాడుతూ సభ్యులకు మరియు యావత్ తెలంగాణ ప్రజలకు రాష్ట్ర అవతరణ దినోత్సవ శుభకాంక్షాలు తెలియజేసారు. లాక్ డౌన్ సమయంలో తెరాస ప్రభుత్వం రాష్ట్రంలో తీసుకుంటున్న ప్రణాళికలుమరియు చేస్తున్న కార్యక్రమాలను గురించి వివరించారు. తెరాస మలేషియా చేస్తున్న సేవా కార్యక్రమాలను కొనియాడారు. ప్రస్తుత పరిస్థితులకనుగుణంగా ప్రతీవిషయంలో జాగ్రత్త వహించాలని సూచించారు.

సభ్యులకు మరియు ప్రవాస తెలంగాణ వాసులకు అధ్యక్షులు చిట్టిబాబు రాష్ట్ర అవతరణ దినోత్సవ శుభకాంక్షలు తెలియజేసారు. ఇతర దేశాలనుండి తిరిగి రాష్ట్రానికి చేరుకుంటున్న వారిని ప్రభుత్వం ఆదరిస్తున్న తీరును మరియు కల్పిస్తున్న సదుపాయాలను కొనియాడారు. దుబాయ్ నుండి వచ్చిన 25 మంది బాధితులకు వారి ఆర్ధిక స్థితిని తెలుసుకొని తన సొంత ఖర్చులతో వారికి క్వారంటైన్ శిభిరంలో చేర్చిన మహేష్ బిగాల గారిని అభినందించారు.

రేలారే గంగ మాట్లాడుతూ ఒక కొత్త తీరుగా రాష్ట్ర అవతరణ వేడుకలు జరుపుకోవడం సంతోషంగా ఉందని, ఈ కార్యక్రమంలో తనని బాగస్వామ్యురాలిని చేసినందుకు ఉపాధ్యక్షులు మారుతికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసారు. ఉద్యమసమయంలో పాడిన పాటలను పాడుతూ నాటి జ్ఞాపకాలను గుర్తుచేసుకున్నారు.

కార్యక్రమాన్ని నిర్వహించిన కార్యదర్శి గుండా వెంకటేశ్వర్లు లాక్ డౌన్ సమయంలో రాష్ట్రంలో నిర్వహించిన అన్నదాన కార్యక్రమ వివరాలనవ్, మలేషియాలో చిక్కుకున్న బాధితుల వివరాలను మరియు వారికి అందించిన సహాయాన్ని గురించి మహేష్ బిగాల గారికి వివరించడం జరిగింది.

కార్యక్రమంలో కోర్ కమిటీ సభ్యులు రమేష్ గౌరు, మునిగల అరుణ్, బొయిని శ్రీనివాస్, బొడ్డు తిరుపతి,గద్దె జీవన్ కుమార్, సందీప్ కుమార్ లగిశెట్టి, సత్యనారాయణరావ్ నడిపెల్లి, రవితేజ, హరీష్ గుడిపాటి, శ్రీనివాస్ ముల్కల, సాయి హేమంత్, రవిందర్ రెడ్డి లు పాల్గొన్నారు.