WorldWonders

ఇండియాలో 80లక్షల ఏళ్ల కిందటి శిలాజాలం లభ్యం

2020 Wonders of India || Fossil Found In UP Is 80Lakh Years Old

దాదాపు 50 నుంచి 80 లక్షల ఏళ్లనాటి ఓ జంతు శిలాజాన్ని శాస్త్రవేత్తలు కనుగొన్నారు. ఉత్తరప్రదేశ్‌లోని శివాలిక్ పర్వత శ్రేణుల్లో ఉన్న బాద్షాహి బాగ్ ప్రాంతం వద్ద దీనిని కనుగొన్నారు. అటవీ శాఖ అధికారులతో పాటు డబ్ల్యూడబ్ల్యూఎఫ్ అనే వన్యప్రాణి సంరక్షణ సంస్థ సభ్యులు సంయుక్తంగా కలిసి దీనిని కనుగొన్నారు. ఈ శిలాజం దాదాపు 50 నుంచి 80 లక్షల ఏళ్లనాటికి చెందినదని, స్టెగొడాన్ జాతికి చెందిన ఏనుగు వంటి జంతువుకు సంబంధించినదని వారు తెలిపారు. ఇది ఆ జంతువు కింది దవడ అయి ఉండొచ్చని వారు చెబుతున్నారు. దీనిపై మరిన్ని పరిశోధనలు చేయాల్సి ఉందని, దాని ద్వారా మరిన్ని విషయాలను తెలుసుకొనేందుకు వీలుకలుగుతుందని వారు తెలిపారు.