NRI-NRT

అంతర్జాలంలో నాట్స్ పద్య సంగీత విభావరి

NATS Padya Gaana Kacheri Online via Zoom By Gummadi Gopalakrishna

నాట్స్ ఆధ్వర్యంలో అంతర్జాలంలో పద్య సంగీత విభావరి కార్యక్రమాన్ని నిర్వహించారు. సూర్యం గంటి వ్యాఖ్యాతగా వ్యవహరించిన ఈ కార్యక్రమంలో ప్రముఖ రంగస్థల నటులు గుమ్మడి గోపాలకృష్ణ పాల్గొని శ్రీనాథుడు, అల్లసాని పెద్దన్నల రచనలను, హరిశ్చంద్ర, చింతామణి నాటక పద్యాలను ఆలపించి ప్రవాసులను అలరించారు. భావ వ్యక్తీకరణకు తెలుగు పద్యాలు దోహదపడతాయని ఆయన పేర్కొన్నారు. కరోనా కారణంగా జీవనోపాధి కోల్పోయిన కళాకారులను నాట్స్ సంస్థ ఆదుకోవాలని గోపాలకృష్ణ చేసిన విన్నపాన్ని నాట్స్ ఛైర్మన్ అప్పసాని శ్రీధర్ పరిశీలిస్తామని హామీనిచ్చారు. అనంతరం రంగస్థల నటీమణి రత్నశ్రీ తులాభారం పద్యాలను ఆలపించి ఆకట్టుకున్నారు. కార్యక్రమంలో కొర్రపాటి మధు, అరుణ గంటి తదితరులు పాల్గొన్నారు.