అమెరికాలోని చికాగాలో కాల్పుల ఘటన జరిగింది.
గ్రీషామ్ ప్రాంతంలో జరిగిన కాల్పుల్లో 14 మంది తీవ్రంగా గాయపడ్డారు.
కొందరు అంత్యక్రియలు నిర్వహించి వెళ్తున్న సమయంలో కాల్పలు ఘటన చోటుచేసుకున్నది.
ఈ సంఘటనతో సంబంధం ఉన్న ఓ వ్యక్తిని కస్టడీలో తీసుకున్నారు.
వెస్ట్ 79 స్ట్రీట్లో అంత్యక్రియలు జరుగుతున్న ప్రాంతంలో ఓ నల్ల వాహనంలో వచ్చిన వ్యక్తి వారిపై కాల్పులు జరిపాడు.
అంత్యక్రియలకు హాజరైన వారు కూడా తిరిగి కాల్పులు జరిపినట్లు సమాచారం.
మొత్తం 14 మంది వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నట్లు చికాగో అధికారులు చెప్పారు.
కాల్పులకు దారితీసిన కారణాల గురించి ఇంకా ఎటువంటి సమాచారం లేదు.
ఓ శ్మశానవాటిక నుంచి కాల్పుల శబ్ధాలు వినిపించినట్లు స్థానికులు చెప్పారు.