Devotional

శ్రీశైలం దర్శనాలు మరో 5రోజుల పాటు రద్దు

శ్రీశైలం దర్శనాలు మరో 5రోజుల పాటు రద్దు

మరో 5 రోజుల పాటు కొనసాగింపు

_శ్రీశైలమహాక్షేత్రంలో కరోనా రోజు రోజుకి విజృంభించడంతో మరో ఐదు రోజుల పాటు శ్రీస్వామి అమ్మవార్ల దర్శనాలు నిలుపుదల చేస్తున్నట్లు ఈవో కె.ఎస్.రామారావు తెలిపారు.

తాసిల్దార్ రాజేంద్ర సింగ్ శ్రీశైలం ను కంటైన్మెంట్ జోన్ గా ప్రకటించారు.

ఈ విషయమై తహశీల్దార్, వైద్యాధికారి సోమశేఖరయ్య సూచనల మేరకు దేవాదాయ కమిషనర్, జిల్లా కలెక్టర్ అనుమతితో మరో 5 రోజుల పాటు దర్శనాలు నిలుపుదల చేశారు.

అనంతరం అప్పటి పరిస్థితులు బట్టి తగిన చర్యలు తీసుకోనున్నారు_.

_స్వామి అమ్మవార్లకు జరిగే నిత్యకైంకర్యాలు యధావిధిగా జరుగుతాయి. భక్తుల సౌకర్యార్థం ఆన్లైన్ ద్వారా ₹1,116 రుసుము ను చెల్లించి వారి గోత్రనామాలతో పరోక్ష సేవలను జరిపించుకోవచ్చని ఈవో తెలిపారు.

ఈ నెల 31 వ తేదీన శ్రావణ మాసం రెండవ శుక్రవారం వరలక్ష్మి వ్రతం పరోక్ష సేవగా నిర్వహిస్తున్నారు