DailyDose

ఇవాళ ఏపీలో 7822 కేసులు-TNI బులెటిన్

ఇవాళ ఏపీలో 7822 కేసులు-TNI బులెటిన్

* AP lo last 24 hours lo 7822 Karona Positive Cases and 63 Deaths

* తెలంగాణలో మద్యం దుకాణాలు ఇక నుండి రాత్రి 11 వరకు తెరిచి ఉంటాయి.

* రాజానగరం జీఎస్ఎల్ హాస్పిటల్ నుంచి కోవిడ్ పేషెంట్ పరారీ..పరారీ అయిన వ్యక్తి రాజమండ్రి సెంట్రల్ జైల్ లో రిమాండ్ ఖైదీ గా గుర్తింపు..

* విశాఖ‌ NRI హాస్పిటల్, ఆరోగ్యశ్రీ లక్షల్లో దోపిడీ తప్ప, వైద్యం సహాయం లేదని, బాధితుల ఆక్రంధనతగరపువలస, కోవిడ్ -19 క్వారంటైన్ సెంటర్ లో పారిశుద్ధ్యం లేక, వైద్య సహాయం అందుబాటులో లేక నిన్న రాత్రి మరణంతో తీవ్ర ఆందోళనలో కోవిడ్ బాధితులు.పారిశుద్ధ్య పనులు కూడా చెయ్యని సిబ్బంది.ఓ కరోనా పేషంట్ డ్రైన్ దగ్గర క్రింద పడిపోయారు.జస్ట్ మిస్ లేకపోతే ప్రాణాలు కోల్పోయో పరిస్థితి.

* తెలంగాణలో కరోనా విజృంభణ కొనసాగుతూనే ఉంది. కొత్తగా 983 పాజిటివ్‌ కేసులు నమోదైనట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ తాజా బులెటిన్‌లో వెల్లడించింది. అయితే గత కొన్ని రోజులుగా నిత్యం వెయ్యికిపైగా కేసులు నమోదవుతున్న నేపథ్యంలో నేడు ఆ సంఖ్య కాస్త తగ్గడం ఊరట కలిగించే విషయం. ఇక రాష్ట్రంలో మొత్తం కరోనా కేసులు సంఖ్య 67,660కి చేరింది. మరోవైపు 11 మంది మృతి చెందడంతో మొత్తం ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 551కి పెరిగింది. తాజాగా 1019 మంది కొవిడ్ నుంచి కోలుకోగా.. ఇప్పటి వరకూ డిశ్చార్జి అయిన వారి సంఖ్య 48,609గా ఉంది.
తాజాగా జీహెచ్‌ఎంసీ పరిధిలో 273, రంగారెడ్డిలో 73 కేసులు నమోదయ్యాయి.