ఆ మధ్య జరిగిన అవార్డ్ ఫంక్షన్లో సూర్య సతీమణి జ్యోతిక ఆలయ నిర్వహణకి పెట్టే ఖర్చుతో పాటు హుండీలలో వేసే మొత్తాన్ని ఆసుపత్రులలో వసతులు కల్పించడానికి కేటాయిస్తే బాగుంటుందని పేర్కొంది. దీనిపై అప్పట్లో పెద్ద ఎత్తున దుమారం రేగింది. పలువురు అర్చుకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. అయినప్పటికీ సూర్య కూడా జ్యోతిక మాటలకి కట్టుబడి ఉన్నట్టు తెలిపారు. అయితే జ్యోతిక తనని విమర్శించే వారికి చేతలతో గట్టి సమాధానం చెప్పడం చర్చనీయాంశంగా మారింది. తంజావూరు ప్రభుత్వ ఆసుపత్రికి అవసరమైన ఆధునిక పరికరాలు, అదనపు సౌకర్యల మెరుగుదల కోసం జ్యోతిక రూ.25 లక్షల విరాళాన్ని అందించింది. ఈ మొత్తాన్ని ఆరోగ్య మంత్రి విజయ భాస్కర్కి అందించారు. జ్యోతిక చేసిన ఈ మంచి పనికి ప్రజలతో పాటు పలువురు రాజకీయ ప్రముఖులు ప్రశంసలు కురిపిస్తున్నారు.
₹25లక్షల విరాళం
Related tags :