Food

మాంసం తిన్నాక పాలు ఎందుకు తాగకూడదు?

మాంసం తిన్నాక పాలు ఎందుకు తాగకూడదు?

మాంసాహారం తినగానే పాలు ఎందుకు తాగకూడదు?

మాంసాహారం తిన్న తర్వాత పాలు తాగుతున్నారా? అయితే, ఈ విషయాలు మీరు తప్పకుండా తెలుసుకోవాలి.

పాలు ఆరోగ్యానికి మంచిదనే విషయం తెలిసిందే. రోజూ పాలు తాగితే శరీరానికి బోలెడంత శక్తి కాల్షియం అందుతుంది. అయితే, మాంసాహారం తిన్న వెంటనే పాలు తాగడం మాత్రం ఆరోగ్యానికి మంచిది కాదని ఆహార నిపుణులు చెబుతున్నారు. అలా చేస్తే అనారోగ్య సమస్యలు దాడి చేయొచ్చని హెచ్చరిస్తున్నారు. అలాగే.. చికెన్, మటన్‌తోపాటు ఇతరాత్ర నాన్‌వెజ్‌లను కూడా ఒకేసారి తినడం మంచిది కాదని సూచిస్తున్నారు. మరి, పాలు, మాంసాహారం ఆరోగ్యకరమైనవే కదా? కలిపి ఎందుకు తీసుకోకూడదనేగా మీ సందేహం? అలా చేస్తే ఏం జరుగుతుందో చూడండి.

మాంసాహారం తినగానే పాలు ఎందుకు తాగకూడదు?

❂ మాంసాహార పదార్థాలైన చికెన్, మటన్, రొయ్యలు, చేపల్లో ప్రొటీన్ స్థాయిలు చాలా ఎక్కువ.
❂ పాలలో సైతం ప్రొటీన్ పుష్కలంగా ఉంటుంది.
❂ మాంసాహారం తిన్న వెంటనే పాలు తాగడం వల్ల శరీరంలోకి పెద్ద సంఖ్యలో ప్రోటీన్లు చేరతాయి.
❂ పరిమితికి మించిన ప్రోటీన్ల వల్ల శరీరంలో యూరిక్ యాసిడ్ నిల్వలు పేరుకుపోతాయి.
❂ యూరిక్ యాసిడ్‌లు శరీరం నుంచి అంత తేలిగ్గా బయటకు వెళ్లవు.

❂ శరీరంలో అధిక యూరిక్ యాసిడ్ ఉంటే చాలా ప్రమాదకరం.
❂ ఈ యూరిక్ యాసిడ్ కీళ్లల్లో పేరుకుపోయి క్రిస్టల్స్‌గా మారుతుంది.
❂ యూరిక్ యాసిడ్ క్రిస్టల్స్‌గా మారడం వల్ల గౌట్ తదితర వ్యాధులు వచ్చే ప్రమాదం ఉంది.
❂ మాంసాహారం తిన్న వెంటనే పాలు తాగితే జీర్ణం కావడం కష్టమే.
❂ అధిక పోషకాలను, ప్రోటీన్లను జీర్ణించుకోవడం జీర్ణశయానికి కష్టంగా మారుతుంది.
❂ ఈ పరిస్థితి జీర్ణ క్రియ సమస్యలకు కూడా దారి తీయొచ్చు. ఫలితంగా అస్వస్థతకు గురయ్యే అవకాశం ఉంది. కాబట్టి.. ఇకపై పాలు, మాంసాహారాన్ని ఒకేసారి తీసుకోవద్దు.