Politics

వైకాపాలోకి తూగో తెదేపా నేత

తూర్పుగోదావరి జిల్లాకు చెందిన తెదేపా నేత చలమలశెట్టి సునీల్‌ సొంతగూటికి చేరారు. సీఎం వైఎస్‌ జగన్‌ సమక్షంలో ఆయన వైకాపా తీర్థం పుచ్చుకున్నారు. సునీల్‌ను జగన్ సాదరంగా ఆహ్వానించి పార్టీ కండువా వేశారు. ఈ కార్యక్రమంలో ఉపముఖ్యమంత్రి ధర్మాన కృష్ణదాస్‌, మంత్రులు కన్నబాబు, చెల్లుబోయిన వేణుగోపాల కృష్ణ, ఎంపీ వంగా గీత, ఎమ్మె్ల్యేలు ద్వారంపూడి చంద్రశేఖర్‌రెడ్డి, పెండెం దొరబాబు, దాడిశెట్టి రాజా, పర్వత పూర్ణచంద్రప్రసాద్‌ తదితరులు పాల్గొన్నారు.