Politics

తెలంగాణాలో భారీగా నూతన కేసులు

తెలంగాణాలో భారీగా నూతన కేసులు

తెలంగాణ రాష్ట్రంలో నిన్న రాత్రి 8గంటల వరకు 53,086 కరోనా నిర్థారణ పరీక్షలు నిర్వహించగా 1,891 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం ఇప్పటి వరకు నమోదైన కేసుల సంఖ్య 2,08,535కి చేరింది. ఈమేరకు వైద్య ఆరోగ్యశాఖ శుక్రవారం ఉదయం బులిటెన్‌ విడుదల చేసింది. నిన్న ఒక్కరోజే కరోనాతో ఏడుగురు మృతి చెందారు. దీంతో మృతుల సంఖ్య 1,208కి చేరింది. కరోనా బారి నుంచి నిన్న ఒక్క రోజే 1,878 మంది కోలుకున్నారు. దీంతో ఇప్పటివరకు కోలుకున్న బాధితుల సంఖ్య 1,80,953కి చేరింది. రాష్ట్రంలో ప్రస్తుతం 26,374 యాక్టివ్‌ కేసులు ఉన్నాయని, వారిలో 21,801మంది హోం ఐసోలేషన్‌లో చికిత్స పొందుతున్నారని వైద్య ఆరోగ్యశాఖ తెలిపింది. తెలంగాణలో ఇప్పటి వరకు నిర్వహించిన కరోనా నిర్థారణ పరీక్షల సంఖ్య 34,49,925కి చేరింది.