NRI-NRT

అమరావతి రైతులకు షార్లెట్ ప్రవాసాంధ్రుల ₹25లక్షల విరాళం

Charlotte Telugu NRI NRTs Donate 25Lakhs To NRIsForAmaravathi

అమరావతి రాజధాని కోసం భూములు త్యాగం చేసిన రైతులకు ప్రవాసాంధ్రులు అండగా నిలుస్తున్నారు. ‘ఒక రాష్ట్రం-ఒక రాజధాని’ నినాదంతో ఉద్యమిస్తున్న రైతులకు తమ వంతు ఆర్థిక సాయం అందజేసేందుకు #NRIsFORAMARAVATI అనే సంస్థను ఏర్పాటు చేశారు. ఈ సంస్థకు అమెరికాలోని నార్త్ కరోలినా రాష్టం షార్లెట్ ప్రవాసాంధ్రులు ₹25లక్షలు విరాళమిచ్చారు. స్థానిక ప్రవాసులు ఠాగూర్ మల్లినేని, నాగ పంచుమర్తి, నితిన్ కిలారు, శ్రీనివాస్ పాలడుగు, బాలాజి తాతినేని, శ్రీనివాస్ చందు గొర్రెపాటిల ఆధ్వర్యంలో 130 మంది ప్రవాసాంధ్రులు రెండు రోజుల వ్యవధిలో ₹25లక్షలు($31,454) సేకరించి #NRIsFORAMARAVATI సంస్థకు అందచేశారు.