కృతజ్ఞత, ఓర్పుతో జీవితాన్ని గడపటం ఎలాగో లాక్డౌన్ సమయంలో అవగతమైందని చెప్పింది కేథరిన్. పుస్తక పఠనం అంటే తనకు చాలా ఇష్టమని, పుస్తకాలు చదువుతూ, కొత్త సినిమాలు చూస్తూ ఈ విరామాన్ని ఆస్వాదిస్తున్నానని తెలిపింది. సరైనోడు, నేనే రాజు నేనే మంత్రితో పాటు తెలుగులో పలు విభిన్న కథా చిత్రాల్లో నటించిందీ ముద్దుగుమ్మ. ఇతర నాయికలకు భిన్నంగా మనసుకు నచ్చిన సినిమాలతో తన సినీ ప్రయాణాన్ని కొనసాగిస్తున్న ఈ అమ్మడు ప్రస్తుతం లాక్డౌన్ సమయాన్ని దుబాయ్లో గడుపుతోంది. శనివారం ఇన్స్టాగ్రామ్ ద్వారా అభిమానులతో ముచ్చటించింది కేథరిన్. లాక్డౌన్ ముగియగానే ఏం చేస్తారని ఓ అభిమాని అడగ్గా..తిరిగి సాధారణ జీవితాన్ని మొదలుపెడతానని పేర్కొంది. సినిమా షూటింగ్లలో పాల్గొనడంతో పాటు స్నేహితుల్ని కలుస్తానని చెప్పింది. అలాగే విహారయాత్రలకు వెళ్లాలనుందని, ముఖ్యంగా సముద్రతీర ప్రాంతాల్ని సందర్శించాలనుందని తెలిపింది. తనకు వంట చేయడం అంతగా రాదని, దక్షిణాది వంటకాల్లో దోశ, అప్సమ్ చాలా ఇష్టమంది. అబద్ధాలు ఆడేవారు తనకు నచ్చరని, పరిశుభ్రతకు ప్రాధాన్యతనివ్వని వ్యక్తుల్ని తాను దూరం పెడతానని చెప్పింది. కామెడీ కంటే హారర్ సినిమాల్ని తాను ఇష్టపడతానని, ప్రస్తుతం తెలుగులో ‘బింబిసార’తో పాటు ‘భళా తందనాన’ సినిమాల్లో నటిస్తున్నానని కేథరిన్ పేర్కొంది.
నాకు కృతజ్ఞత ఇష్టం
Related tags :